హైదరాబాద్ సరూర్ నగర్లో సాయి కృష్ణ అనే పూజారి అప్సర అనే మహిళను శంషాబాద్లో చంపి.. తన కారులో ఎక్కించుకుని.. తన ప్రాంతానికే తీసుకు వచ్చి మ్యాన్ హోల్లో పూడ్చిన సంగతి విదితమే. ఈ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.
సినిమాను మించిన ట్విస్టులతో ఇటీవల జరిగిన క్రైమ్ కథా చిత్రం అప్సర హత్య కేసు. హైదరాబాద్ సరూర్ నగర్లో సాయి కృష్ణ అనే పూజారి అప్సర అనే మహిళను శంషాబాద్లో చంపి.. తన కారులో ఎక్కించుకుని.. తన ప్రాంతానికే తీసుకు వచ్చి మ్యాన్ హోల్లో పూడ్చిన సంగతి విదితమే. వివాహేతర సంబంధమే ఈ హత్యకు దారి తీసిందని పోలీసులు నిర్ధారించారు. అప్సర పెళ్లి చేసుకోమని పోరు పెట్టడంతో .. అప్పటికే పెళ్లై, పిల్లులున్న సాయి కృష్ణ.. ఆమెను వదిలించుకోవాలన్న ఉద్దేశంతో తానే హత్య చేసినట్లు అంగీకరించినట్లు పోలీసులు చెబుతున్నారు. ఆ తర్వాత ఆమె కనిపించడం లేదంటూ శంషాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
పోలీసులు విచారణ జరుపుతుండగా అసలు ట్విస్ట్ రివీల్ అయ్యింది. అతడే చంపి.. పూడ్చినట్లు తేలింది. అంతలో ఆమెకు గతంలోనే పెళ్లి జరిగిందని, తమిళనాడుకు చెందిన సాఫ్ట్ వేర్ ఉద్యోగిని ప్రేమించి, పెళ్లి చేసుకుందని, ఆ తర్వాత అతడిని హింసించి, కేసు పెట్టడంతో.. మానసికంగా కృంగిపోయిన భర్త ఆత్మహత్య చేసుకుని చనిపోయినట్లు అతడి తల్లి ఆడియో విడుదల చేసింది. అయితే ఈ కేసులో ఇప్పుడు కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రియురాలిని హత్య చేసినందుకు సాయికృష్ణను పోలీసులు అరెస్టు చేసి.. కోర్టులో హాజరు పరిచారు. తమ కస్టడీకి అప్పగించాలని కోరడంతో.. రంగారెడ్డి జిల్లా కోర్టు రెండ్రోజుల కస్టడీకి అనుమతించింది.
ఈ నేపథ్యంలో శంషాబాద్ పోలీసులు సాయికృష్ణను గురువారం కస్టడీలోకి తీసుకున్నారు. రేపటితో కస్టడీ గడువు ముగియనుండటంతో శుక్రవారం రాత్రి నిందితుడిని హత్య జరిగిన ప్రాంతానికి తీసుకెళ్లి సీన్ రీ కన్స్ట్రక్షన్ చేయనున్నారు. తద్వారా అప్సర హత్యకు సంబంధించి పూర్తి వివరాలను సేకరించనున్నారు. శంషాబాద్ మండలం సుల్తాన్ పూర్ వద్ద అప్సరను హత్య చేసిన తర్వాత డెడ్ బాడీని సరూర్ నగర్ తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో ఉన్న మ్యాన్ హోల్లో పూడ్చి పెట్టారు. ఆ మొత్తం సీన్ను రీ కన్ స్ట్రక్షన్ చేయనున్నట్లు తెలుస్తోంది.