హైదరాబాద్ సరూర్ నగర్లో సాయి కృష్ణ అనే పూజారి అప్సర అనే మహిళను శంషాబాద్లో చంపి.. తన కారులో ఎక్కించుకుని.. తన ప్రాంతానికే తీసుకు వచ్చి మ్యాన్ హోల్లో పూడ్చిన సంగతి విదితమే. ఈ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.
హైదరాబాద్లోని సరూర్ నగర్ అప్సర హత్య కేసు సినిమా ట్విస్టుల్లాగా రోజుకో మలుపు తీసుకుంటుంది. అదే ప్రాంతానికి చెందిన ఆలయ పూజారి సాయికృష్ణతో వివాహేతర సంబంధం కారణంగానే అప్సర హత్య జరిగిందని పోలీసులు వెల్లడించారు. పెళ్లై పిల్లలున్న తనను అప్సర పెళ్లి చేసుకోమని కోరడంతోనే బండరాయితో బాది చంపేసినట్లు నిందితుడు అంగీకరించాడంటూ పేర్కొన్నారు. అయితే ఆమె హత్య ఘటనతో మరో కోణం వెలుగు చూసింది.
తన ప్రియురాలైన అప్సరను పూజారి సాయికృష్ణ దారుణంగా హత్య చేసిన విషయం విదితమే. అయితే, చాలా మంది అసలు నిందితుడు సాయికృష్ణ అసలు బ్యాగ్రౌండ్ ఏంటి? అతడు స్వస్థలం ఎక్కడా అని గూగుల్ లో సెర్చ్ చేస్తున్నారు.
అప్సర కేసులో దిమ్మతిరిగే ట్విస్ట్ చోటు చూసింది. ఆమెకు గతంలోనే ఓ వ్యక్తితో పెళ్లి జరిగినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఫొటోలు కూడా కాస్త వైరల్ గా మారాయి.
అప్సర హత్య కేసు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే, అప్సర మృతదేహానికి వైద్యులు పోస్ట్ మార్టం నిర్వహించారు. అనంతరం ఆ రిపోర్టు ను వైద్యులు పోలీసులకు అప్పగించారు.
అప్సరను దారుణంగా హత్య చేసిన పూజారి సాయికృష్ణ ప్రస్తుతం రిమాండ్ లో ఉన్నాడు. అయితే, అంతకంటే ముందు నిందితుడు పోలీసుల విచారణలో బోరున విలపించనట్లు తెలుస్తుంది.