అప్సర కేసులో దిమ్మతిరిగే ట్విస్ట్ చోటు చూసింది. ఆమెకు గతంలోనే ఓ వ్యక్తితో పెళ్లి జరిగినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఫొటోలు కూడా కాస్త వైరల్ గా మారాయి.
తెలుగు రాష్ట్రాల్లో అప్సర కేసు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. అప్సర పెళ్లి చేసుకోవాలని కోరినందుకు ఆమె ప్రియుడు పూజారి సాయికృష్ణను ఆ యువతిని దారుణంగా హత్య చేశాడు. ఆ తర్వాత మృతదేహాన్ని ఎవరికీ కనిపించకుండా మ్యాన్ హోల్ లో పడేసి పూడ్చి పెట్టి చేతులు దులుపుకున్నాడు. అసలు విషయం వెలుగులోకి రావడంతో నిందితుడు సాయికృష్ణను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదిలా ఉంటే, ఈ కేసులో రోజుకు ఒక విషయం బయటపడుతూ సెన్సేషన్ క్రియేట్ అవుతోంది. అయితే, తాజాగా అప్సర కేసులో మరో దిమ్మతిరిగే ట్విస్ట్ చోటు చేసుకుంది. గతంలో ఓ వ్యక్తితో అప్సరకు వివాహం జరిగినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఫొటోలు కూడా కాస్త వైరల్ గా మారుతున్నాయి.
తెలుగు రాష్ట్రాలను ఓ ఊపు ఊపుతున్న అప్సర కేసులో తాజాగా ఊహించని విషయం బయటపడింది. తాజాగా ఆమె పెళ్లి ఫొటో కాస్త వైరల్ గా మారింది. దీని బట్టి చూస్తే అప్సరకు గతంలోనే ఓ వ్యక్తితో వివాహం జరిగినట్లుగా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ విషయం తెలుసుకుని అందరూ ఒక్కసారిగా షాక్ గురవుతున్నారు. అప్సర తల్లి ఇప్పటి వరకు నా కూతురికి గతంలోనే వివాహం జరిగిందని నోరు విప్పకపోవడం విశేషం. ఇకపోతే, అప్సర పెళ్లి ఫొటో, ఆమె భర్తతో దిగిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దీంతో అప్సరకు నిజంగానే పెళ్లి జరిగిందా అని అందరూ నోళ్లు తెరుస్తున్నారు. దీంతో ఈ కేసు మళ్లీ ఎక్కడికి తిరుగుతుందో అని అంతా ఆసక్తిగా చూస్తున్నారు.