తన ప్రియురాలైన అప్సరను పూజారి సాయికృష్ణ దారుణంగా హత్య చేసిన విషయం విదితమే. అయితే, చాలా మంది అసలు నిందితుడు సాయికృష్ణ అసలు బ్యాగ్రౌండ్ ఏంటి? అతడు స్వస్థలం ఎక్కడా అని గూగుల్ లో సెర్చ్ చేస్తున్నారు.
అప్సర హత్య కేసు ఇప్పుడు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. రోజుకొక కొత్త విషయం వెలుగులోకి వస్తూ హాట్ టాపిక్ గా మారుతోంది. ఇదిలా ఉంటే, ఈ కేసులో తాజాగా మరో ట్విస్ట్ వెలుగు చూసింది. అప్సరకు ఇది వరకే ఓ వ్యక్తితో వివాహం జరిగిందని, దీనికి సంబంధించిన ఫొటోలు కూడా వైరల్ గా మారుతున్నాయి. అసలు ఇంతకి నిందితుడు సాయి కృష్ణ చేసే వృత్తి ఏంటి? అతను ఏం చదువుకున్నాడు? అతని స్వస్థలం ఎక్కడ అనే తెలుసుకునేందుకు అందరూ గూగుల్ లో సెర్చ్ చేస్తున్నారు. కాగా, సాయికృష్ణ బ్యాగ్రౌండ్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
సాయికృష్ఱ స్వస్థలం ఏపీలోని అంబేద్కర్ కోనసీమ జిల్లా గన్నవరం మండలం నరేంద్రపురం. అతడు ఎంబీఏ పూర్తి చేశాడు. వీరిది బ్రాహ్మణ కుటుంబం కావడంతో తండ్రి గతంలో పూజారిగా పని చేశాడు. అయితే, వీళ్లు చాలా ఏళ్ల కింటే హైదరాబాద్ కు వలస వచ్చి నగరంలోని సరూర్ నగర్ వెంకటేశ్వర కాలనీలో నివాసం ఉంటున్నారు. తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ సాయికృష్ణ స్థానికంగా ఉండే మైసమ్మ దేవాలయంలో పూజారిగా పని చేసేవాడు. దీంతో పాటు సాయి కృష్ణ పలు వ్యాపారాలు కూడా చేస్తున్నట్లు తెలుస్తుంది.
ఇతనికి 2010లోనే ఓ మహిళతో వివాహం జరిగి ఓ కూతురు కూడా ఉంది. ఇతడు గుడిలో పూజారిగా ఉన్న క్రమంలోనే గుడికి వచ్చిన అప్సరతో పరిచయం పెంచుకుని ఆమెతో శారీరకంగా దగ్గరయ్యాడు. ఆ తర్వాత అప్సర పెళ్లి చేసుకోవాలని సాయికృష్ణను టార్చర్ చేయడంతో పక్కా ప్లాన్ తోనే అప్సరను అతి దారుణంగా హత్య చేశాడు. అనంతరం ఆమె డెడ్ బాడీ కనిపించకుండా ఉండేందుకు స్థానికంగా ఉన్న ఓ మ్యాన్ హోల్ లో పడేసి సిమెంట్ చేశాడు. అసలు విషయం వెలుగులోకి రావడంతో నిందితుడు సాయికృష్ణను పోలీసులు అదుపులోకి తీసుకుని కోర్టు ముందు హాజరుపరిచారు. విచారించిన న్యాయస్థానం 14 రోజుల వరకు రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు అతడిని చర్లపల్లి జైలుకు తరలించారు.