దేశంలో ఎక్కడో అక్కడ వరకట్న వేధింపుల కారణంగా ఎంతోమంది మహిళలు బలవన్మరణాలకు పాల్పపడుతున్నారు. ఎన్ని చట్టాలు వచ్చినా.. అత్తింటి వేధింపులు కొనసాగుతూను ఉన్నాయని మహిళా సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇటీవల చాలా మంది చిన్న విషయాలకే మనస్థాపానికి గురై సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. డిప్రేషన్ లో ఎదుటివారిపై దాడులు చేయడమో.. లేదా ఆత్మహత్యలు చేసుకోవడం లాంటివి చేస్తున్నారు. దీంతో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంటుంది. చాలా వరకు ఆర్థిక ఇబ్బందులు, వివాహేతర సంబంధాలు, పని ఒత్తిడి వల్ల కొన్ని అయితే.. వరకట్న వేధింపుల వల్ల ఎంతోమంది మహిళలు బలవన్మరణాలకు పాల్పపడుతున్నారు. అత్తింట్లో వేధింపులు భరించలేక ఓ వివాహిత షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఈ ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
అత్తింటి వారి తరుపు బంధువులు కొంతకాలంగా అవమానిస్తున్నారని ఓ వివాహిత బలవన్మరణానికి పాల్పపడింది. ఈ ఘటన ఎల్ బీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. సరూర్ నగర్ కృష్ణానగర్ కాలనీలో నివాసం ఉంటున్న విష్ణువర్ధన్ సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. విష్ణువర్థన్ కి ఆల్వీన్ కాలనీకి చెందిన శశికళ (33) తో కొంతకాలం క్రితం వివాహం జరిగింది. పెళ్లైన కొత్తలో ఈ జంట ఎంతో అన్యోనంగా ఉంటూ వచ్చారు. వీరికి శ్రెయారెడ్డి అనే కూతురు ఉంది. ఇటీవల శశికళను అత్తింటి వారు.. బంధువులు పదే పదే అవమానిస్తున్నారని, ప్రతి చిన్న విషయానికి గొడవ పడుతున్నారని తీవ్ర మనస్థాపానికి గురైతూ వచ్చింది.
ఈ విషయం శశికళ తల్లి యానాం గౌరీకుమారికి పలు మార్లు చెప్పుకొని బాధపడింది. పాప కోసం ధైర్యంగా ఉండాలని శశికళ తల్లి చెబుతూ వచ్చింది. ఈ మద్య మామ, భర్త తరుపు బంధువులు ప్రతి విషయంలో కల్పించుకొని కావాలని అవమానపరుస్తూ.. వేధించడం మొదలు పెట్టారు. ఇక వేధింపులు భరించలేక శశికళ ఇంట్లో ఫ్యాన్ కి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. విష్ణువర్థన్ గురువారం ఉదయం శశికళ తల్లి గౌరీకుమారికి ఫోన్ చేసి అర్జంట్ గా ఇంటికి రమ్మన్నాడు. అప్పటికే ఆమెకు అనుమానం వచ్చి కూతురు పక్కింటి వారికి ఫోన్ చేయగా.. శశికళ ఆత్మహత్య చేసుకుందని తెలిపారు.
విషయం తెలుసుకున్న శశికళ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. తన కూతురు ఎంతో ధైర్యంగా ఉండేదని.. అత్తింటి వారితో పాటు వారి బంధువులు కూడా వేధించడం వల్లనే తన కూతురు మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకుందని.. నింధితులను కఠినంగా శిక్షించాలని గౌరీ కుమారి ఎల్ బీ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.