అప్సరను దారుణంగా హత్య చేసిన పూజారి సాయికృష్ణ ప్రస్తుతం రిమాండ్ లో ఉన్నాడు. అయితే, అంతకంటే ముందు నిందితుడు పోలీసుల విచారణలో బోరున విలపించనట్లు తెలుస్తుంది.
పూజారి సాయికృష్ణ అప్సర అనే యువతిని నమ్మించి దారుణంగా హత్య చేసి మృతదేహాన్ని మ్యాన్ హోల్ లో పడేసిన విషయం తెలిసిందే. ఇదే ఘటన ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. దీంతో మొదటగా పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇక ఎట్టకేలకు అప్సరను చంపింది ఆమె ప్రియుడు పూజారి సాయికృష్ణ అని పోలీసులు తెలుసుకున్నారు. ఆ తర్వాత అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు నిజాలు బయటపెట్టాడు. అనంతరం పోలీసులు అప్సర మృతదేహాన్ని మ్యాన్ హోల్ నుంచి బయటకు తీసి పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
అయితే ఈ కేసును విచారించిన న్యాయస్థానం నిందితుడు సాయికృష్ణకు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు అతడిని చర్లపల్లి జైలుకు తరలించారు. ఇదిలా ఉంటే, అంతకంటే పోలీసుల విచారణలో నిందితుడు సాయికృష్ణ కీలక విషయాలు వెల్లడించి బోరున విలపించినట్లు తెలుస్తుంది. నేను అప్సరను ఉద్దేశపూర్వకంగా హత్య చేయలేదని, పెళ్లి చేసుకోకుంటే ఫోటోలు సోషల్ మీడియాలో పెడతానని టార్చర్ పెడతా అన్నందుకే హత్య చేశానని చెప్పాడట. ఈ క్రమంలోనే పోలీసుల ఎదుటే బోరున విలపిస్తూ ఆత్మహత్య చేసుకుంటానని నిందితుడు సాయికృష్ణ హల్ చల్ చేశాడని తెలుస్తుంది.