సంచలనంగా మారిన అప్సర హత్య కేసుపై తాజాగా కీలక విషయాలు వెల్లడించారు. మీడియాతో మాట్లాడుతూ అసలేం జరిగిందనేది పూసగుచ్చినట్టు వివరించే ప్రయత్నం చేశారు.
అప్సర హత్య కేసు ఇప్పుడు నగరంలో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. పక్కా ప్లాన్ తోనే నిందితుడు సాయి కృష్ణ ప్రియురాలిని అతి దారుణంగా హత్య చేశాడు. ఆ తర్వాత మృతదేహాన్ని మ్యాన్ హాల్ లో పడేసి మిస్సింగ్ కేసుగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. ఇక అసలు నిజాలు వెలుగులోకి రావడంతో పోలీసులు నిందితుడు సాయి కృష్ణను అదుపులోకి తీసుకుని విచారించారు. ఇక పోలీసుల దర్యాప్తులో నిందితుడు సంచలన విషయాలు బయటపెట్టాడు. అయితే, ఈ కేసుపై పోలీసులు తాజాగా కీలక విషయాలు వెల్లడించారు.
నగరంలో తీవ్ర కలకలంగా మారిన అప్సర హత్య కేసుపై శంషాబాద్ డీసీపీ నారాయాణ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కీలక విషయాలు వెల్లడించారు. మాకు జూన్ 5న అప్సర కనిపించకుండాపోయిందని ఫిర్యాదు అందింది. దీంతో మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని ఆమె ఆచూకి కోసం గాలింపు చర్యలు చేపట్టాము. అయితే, అప్సర హత్య కంటే ముందు నిందితుడు సాయి కృష్ణ, అప్సర ఇద్దరూ కలిసి తిరిగారు. ఇక జూన్ 3న నిందితుడు సాయి కృష్ణ మాట్లాడాలంటూ అప్సరను సరూర్ నగర్ రమ్మన్నాడు. అతడు కోరినట్టే ఆ యువతి సరూర్ నగర్ వెళ్లింది. ఆ తర్వాత ఇద్దరూ కారులో శంషాబాద్ వెళ్లారు.
ఇక పక్కా ప్లాన్ తోనే సాయి కృష్ణ అప్సరను చంపాలని అనుకున్నట్లు తెలిపారు. అక్కడికి వెళ్లాక కారులో ముందు సీటులో కూర్చున్న అప్సరను కవర్ ముఖానికి చుట్టి ఊపిరాడకుండా చేసి హత్య చేయాలని అనుకున్నాడు. కానీ, ఆ యువతి ప్రతఘటించింది. దీంతో అతనికి ఏం చేయాలో తెలియక కారులో ఉన్న ఓ కర్రతో ఆమెపై బలంగా బాది దారుణంగా హత్య చేశాడు. ఆ తర్వాత ఎవరికి అనుమానం రాకుండా ఆమె మృతదేహన్ని మ్యాన్ హోల్ లో వేసి సిమెంట్ చేయాలని అనుకున్నాడు. ఇందుకోసం నిందితుడు సాయి కృష్ణ ఇద్దరి వ్యక్తుల సాయంతో రెండులారీల ఇసుకుని తెప్పించుకున్నాడు.
అనంతరం ఆ మ్యాన్ హోల్ లో అప్సర శవాన్ని వేసి సిమెంట్ తో ప్యాక్ చేశాడంటూ పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు. ఇదిలా ఉంటే, అప్సర సీరియల్స్ లో నటించేదని, ఆమెను మెల్లగా ట్రాప్ చేసి సాయి కృష్ణ తనవైపు తిప్పుకున్నాడని అన్నారు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి తిరిగారు. ఇక అప్సర సాయికృష్ణను పెళ్లి చేసుకోవాలని కోరింది, ఇది ఇష్టం లేని సాయి కృష్ణ.. పరువు కోసం ప్రియురాలిని హత్య చేశాడని పోలీసులు తెలిపారు. మరో విషయం ఏంటంటే? అప్సరను సాయి కృష్ణ గతంలోనే హత్యకు ప్లాన్ చేసినట్లుగా విచారణలో తేలిందని పోలీసులు వివరించారు. ఇక మరిన్ని విషయాల కోసం పోస్ట్ మార్టం రిపోర్ట్ కీలకం కానుందని పోలీసులు తెలిపారు.