హైదరాబాద్ సరూర్ నగర్లో సాయి కృష్ణ అనే పూజారి అప్సర అనే మహిళను శంషాబాద్లో చంపి.. తన కారులో ఎక్కించుకుని.. తన ప్రాంతానికే తీసుకు వచ్చి మ్యాన్ హోల్లో పూడ్చిన సంగతి విదితమే. ఈ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.
సరూర్ నగర్లో జరిగిన అప్సర హత్య కలకలం రేపుతుంది. పోలీసులు సాయికృష్ణను అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయాలు బయటికొస్తున్నాయి.
అప్సర హత్య కేసులో మీడియా వారు సాయికృష్ణ తండ్రితో మాట్లాడారు. అప్సర ఎవరో తమకు తెలియదని, తన కొడుకు వ్యక్తిత్వం చాలా మంచిదని చెప్పుకొచ్చారు.