దేశంలో పావురాళ్లు కలకలం సృష్టిస్తున్నాయి. ప్రేమకు చిహ్నాలైన పావురాళ్లతో పొరుగుదేశమైన చైనా కుట్రలు పన్నుతున్నట్లు తెలుస్తోంది. దేశంలో అక్కడక్కడ రబ్బర్ట్యాగ్ను కాళ్లకు కట్టిన పావురాళ్లు జనాల కంటపడుతున్నాయి. ఖమ్మం జిల్లాలో ఈ సంఘటన జరిగింది.. ఇలాంటి సంఘటనలు తరుచూ జరుగుతుండడంతో దేశ భద్రతపై ప్రజల్లో అనుమానాలు రేకిస్తున్నాయి. వీటి వెనుక ఏదైనా కుట్ర దాగుందా… అనే భయం ప్రజల్లో కలుగుతోంది.
ఈ ఘటనపై చర్చ జరుగుతుండగానే తాజాగా ఖమ్మం జిల్లాలోను అలాంటి సంఘటనే జరిగింది. ఆ పావురం కాలికి ఎల్లో కలర్ ట్యాగ్ ఉండటంపై పలు సందేహాలు కలుగుతున్నాయి. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం దమ్మాయిగూడెంలో రైతుకు ఓ పావురం కంటపడింది. దానికి చైనా ట్యాగ్ ఉండటంతో దాన్ని బంధించి పైఅధికారులకు సమాచారం అందించారు అక్కడి స్థానికులు.
ప్రకాశం జిల్లాలోనూ ఇదే తరహా ఘటన జరిగింది. చీమకుర్తి మండలంలోని నెహ్రూనగర్లో రబ్బరు ట్యాగ్తో కూడిన పావురం కలకలం రేపింది. స్థానికంగా ఉన్నఅపార్ట్మెంట్లో నాగరాజు అనే యువకుడు పావురాన్ని గమనించాడు. దాని కాలికి చైనా అక్షరాలతో ఉన్న రబ్బర్ ట్యాగ్ ను గుర్తించాడు. దానికి అడ్డంగా 2019, నిలువుగా 2207 కోడ్స్ ఉన్నాయి. అయితే, అతని ఇంట్లోకి తరచుగా పావురాలు వస్తుంటాయి. ఈ క్రమంలో.. నాగరాజు ఒక పావురం కాలికి కొత్తగా ఏదో ట్యాగ్ ఉండటం అతడి దృష్టిని ఆకర్షించడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీని వెనుక నిజంగానే కుట్ర కోణం ఉందా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.