కొన్ని రోజులుగా కురుస్తున్న వానల కారణంగా జనం నానా ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లపై మురికి నీరు నిలిచి వాహనదారులు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నప్పటికీ డ్రైనేజీ నీటితో తిప్పలు తప్పట్లేవు.
గత కొన్ని రోజులులగా రాష్ట్రంలో కురుస్తున్నాయి. వర్షాల కారణంగా వాగులు, వంకలు, నదులు ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి. జలపాతాలు కూడా పరవళ్లు తొక్కుతున్నాయి. రికార్డ్ స్థాయిలో వర్షపాతం నమోదు అయ్యింది. కొన్ని ప్రాంతాల్లో గ్రామాలు కూడా వరద బీభత్సానికి కొట్టుకుపోయాయి. ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలు వాహనాలు కొట్టుకుపోయాయి. వానల బీభత్సానికి భారీగా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం వాటిల్లింది. ఈ వానల కారణంగా నగరాల్లో డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. వాహనదారులు తీవ్రంగా ఇబ్బుందులు పడుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో జీహెచ్ ఎంసీ అధికారులు, ట్రాఫిక్ పోలీసులు తమ వంతు సహకారం అందిస్తున్నారు. తాజాగా కొద్దిరోజులుగా పడుతున్న వానల కారణంగా రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. అయినా విధినిర్వహణలో ఓ లేడీ ఇన్పెక్టర్ తన హోదాను పక్కన పెట్టి జనం సేవలో మునిగిపోయింది. మానవత్వాన్ని చాటుకుంది. ఇంతకీ ఆమె చేసిన పనేంటో.. అది ఎక్కడ జరిగిందో వివరాలను తెలుసుకుందాం..
ఖమ్మం నగరంలో గత కొన్ని రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాలకు జనం అతలాకుతలం అవుతున్నారు. రోడ్లన్నీ డ్రైనేజీ నీటితో నిండి చెరువులను తలపిస్తున్నాయి. దీంతో మోకాళ్ల లోతు నీటిలో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పాత బస్టాండ్ సమీపంలో ట్రాఫిక్ స్థంభించి అస్తవ్యస్తంగా మారింది. దీంతో ట్రాఫిక్ సీఐ అంజలి తన బృందంతో రంగంలోకి దిగారు. వర్షంలో ట్రాపిక్ ఇబ్బందులు లేకుండా వెహికల్స్ను క్రమబద్దీకరించారు. పాత బస్టాండ్లోని ట్రాఫిక్ సెంటర్ నుండి డివైడర్ వరకు తాడు కట్టి ట్రాఫిక్ ను క్లియర్ చేశారు.
రోడ్ల మీద భారీగా నీరు ప్రవహిస్తుండడంతో తల్లిబిడ్డ ట్రాఫిక్లో చిక్కుకున్నారు. వారికి సీఐ అంజలి తన సహకారం అందించి సురక్షితంగా సేవ్ చేసింది. మోకాళ్ల లోతు నీటిలో ప్యాంట్ను పైకి మడిచి.. తన హోదాను మరచి జనం కోసం సేవ చేసింది. జోరు వానలో కూడా విధినిర్వహణలో నిమగ్నమైన లేడీ ఇన్స్పెక్టర్ తన మానవత్వాన్ని చాటుకుంది. ఆమె సేవలకు అందరు శభాష్ అని ప్రశంసలు కురిపిస్తున్నారు. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి.