తెలుగు ఇండస్ట్రీలో పౌరాణిక, సాంఘిక, జానపద చిత్రాల్లో ఎన్నో అద్బుతమైన పాత్రలకు ప్రాణంపోసిన మహానటులు ఎన్టీఆర్.. వెండితెరపైనా కాదు.. రాజకీయాల్లోనూ తనదైన మార్క్ చాటుకున్నారు. తెలుగు దేశం పార్టీ స్థాపించి పేద ప్రజల గుండెల్లో ‘అన్న’గా సుస్థిర స్థానం సంపాదించారు.
నేటికాలంలో చాలా మంది ఏ వస్తువులను కొనాలన్న ఆన్ లైన్ షాపింగ్ లకే ప్రాధాన్యత ఇస్తున్నారు. కూరగాయల మొదలు ప్రతి దానిని ఆన్ లైన్ లో ఆర్డర్ చేస్తున్నారు. అయితే కొన్ని సందర్భాల్లో ఈ ఆన్ లైన్ షాపింగ్ తో కస్టమర్లకు ఊహించని షాక్ లు తగులుతున్నాయి. తాజాగా ఆన్ లైన్ లో ఫోన్ ఆర్డర్ చేసిన వ్యక్తి.. పార్శిల్ ఓపెన్ చేసి చూసి షాకయ్యాడు.
ఈ మద్య తెలుగు రాష్ట్రాల్లో వరుస గుండెపోటు మరణాలతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. సామాన్యులే కాదు సెలబ్రెటీలు సైతం అకస్మాత్తుగా గుండెపోటుతో కన్నుమూస్తున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి.
ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో గాయపడ్డవారికి, మృతుల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం ఎక్స్ గ్రేషియా ప్రకటించింది.
ఇటీవల మనిషి ఏ క్షణంలో ఎలా చనిపోతాడో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. తెలుగు రాష్ట్రాల్లో వరుస గుండెపోటు మరణాలు తీవ్ర కలకలం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఇక రోడ్డు ప్రమాదాల్లో మరణాలు షరా మామూలే అయ్యాయి.
తెలంగాణ, ఏపీల్లో పదో తరగతి పరీక్షలు సోమవారం నుండి ప్రారంభమయ్యాయి. విద్యార్థుల వెంట తల్లిదండ్రులు పరీక్షా కేంద్రాలకు వచ్చారు. దీంతో అక్కడ సందడి వాతావరణం కనిపించింది. కానీ ఈ పరీక్ష వేళ ఓ విద్యార్థి ఇంట పెను విషాదం నెలకొంది.
భార్యాభర్తలు అన్నాక గొడవలు జరగడం సహజం. కానీ, ఇంతదానికి కొందరు దంపతులు హద్దులు దాటి దారుణాలకు తెగబడుతున్నారు. అచ్చం ఇలాగే ఓ భర్త మద్యం మత్తులో భార్యను రోకలి బండతో కొట్టి చంపాడు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. అసలేం జరిగిందంటే?
ఆ బాలిక పేరు దీప్తి. ఖమ్మంలోని ఓ గురకుల పాఠశాలలో ప్రస్తుతం 10వ తరగతి చదువుతుంది. అయితే అక్కడ ఆ విద్యార్థినిని గత కొంత కాలం నుంచి వేధింపులకు గురి చేస్తున్నారు. వీరి టార్చర్ ను భరించలేకపోయిన ఆ బాలిక.. తాజాగా ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అసలేం జరిగిందంటే?
తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల వరుసగా కుక్కల దాడులు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా వీధి కుక్కలు ఒంటరిగా ఉంటున్న చిన్న పిల్లలను టార్గెట్ చేసుకొని దారుణంగా దాడులకు తెగబడుతున్నాయి. అంబర్ పేట్ ఘటనలో ప్రదీప్ అనే నాలుగేళ్ల చిన్నారిని కుక్కలు కిరాతకంగా కొరికి చంపిన విషయం తెలిసిందే. ఈ తరహా కుక్కల దాడులు వరుసగా జరుగుతున్నాయని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
వేగంగా విస్తరించిన సాంకేతిక విజ్ఞానతో ఎప్పటికప్పుడు కొత్త ప్రయోగాలు చేస్తూ అభివృద్ధి రాకెట్ స్పీడ్ లో దూసుకు పోతుంటే, మరో వైపు జనాల్లో మూఢ నమ్మకాలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. తరచూ ఏదో ఓ ప్రాంతంలో క్షుద్రపూజల కలకలం రేపుతూనే ఉన్నాయి. తాజాగా ఖమ్మం జిల్లాలో క్షుద్రపూజలు కలకలం రేపాయి.