రాజుల కాలంలో గూఢచర్యం కోసం పావురాలను ఉపయోగించేవారని పుస్తకాల్లో చదువుకునే ఉంటారు. శాంతి ధూతలుగా పిలిచే పావురాలను వందల కిలోమీటర్ల దూరంలోని కొత్త ప్రదేశాల్లో వదిలినా అవి తిరిగి తమ గమ్యస్థానానికి చేరుకోగలవట. అందువల్ల.. శత్రు దేశపు రహస్యాలను తెలుసుకునేందుకు వీటిని ఉపయోగించేవారని చరిత్ర పుటల్లో ఉంది.
పక్షుల ప్రేమికులు, జంతువుల ప్రేమికులు చాలా మంది ఉంటారు. వాటి మీద ప్రేమతో వాటికి ఫుడ్ పెడుతుంటారు. అయితే కొన్ని సందర్భాల్లో అవి మనుషుల ప్రాణాలకే ముప్పు తెస్తున్నాయి. పావురాల వల్ల మనుషులకు ముప్పు ఉందని, మేత వేస్తే జరిమానా విధిస్తామని నగర పాలక సంస్థ ప్రకటించింది.
ప్రాణాపాయంలో ఉన్న మనుషుల్ని, జంతువుల్ని కాపాడటం అందరి వల్ల కాదు. తమ ప్రాణాలకు ప్రమాదం అని తెలిసినపుడు మనుషులు సహాయం చేయటానికి అస్సలు పూనుకోరు. మాకెందుకులే అనుకుంటారు. కానీ, తమ ప్రాణాలకు తెగించి ఇతరుల ప్రాణాలు కాపాడే వారు చాలా అరుదుగా ఉంటారు. అలాంటి అరుదైన వ్యక్తుల్లో బెంగళూరుకు చెందిన సురేష్ అనే పోలీస్ కూడా ఒకరు. ఆయన ఓ పక్షి ప్రాణాలు కాపాడటానికి తన ప్రాణాలను పణంగా పెట్టారు. ఎంతో రిస్క్ చేసి దాన్ని కాపాడారు. […]
బిర్యానీ అంటే ఇష్టపడని వారు ఈ దేశంలో చాలా తక్కువ మంది మాత్రమే ఉంటారు. చిన్న నుంచి పెద్ద దాకా బిర్యానీ కోసం అల్లాడిపోతుంటారు. నాన్వెజ్ ఇష్టపడే వారితో పాటు వెజ్ను ఇష్టపడేవారికి కూడా పలు రకాల వెరైటీలు అందుబాటులో ఉన్నాయి. ఇక, బిర్యానీ ప్రియులు నోరెళ్ల బెట్టే విషయం ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. ముంబైలోని కొన్ని ప్రముఖ హోటళ్లలో పావురం మాంసంతో తయారు చేసిన బిర్యానీలు విక్రయిస్తున్నట్లు తెలియవచ్చింది. కోళ్లను, మేకలను పెంచినట్లుగానే వాటిని […]
దేశంలో పావురాళ్లు కలకలం సృష్టిస్తున్నాయి. ప్రేమకు చిహ్నాలైన పావురాళ్లతో పొరుగుదేశమైన చైనా కుట్రలు పన్నుతున్నట్లు తెలుస్తోంది. దేశంలో అక్కడక్కడ రబ్బర్ట్యాగ్ను కాళ్లకు కట్టిన పావురాళ్లు జనాల కంటపడుతున్నాయి. ఖమ్మం జిల్లాలో ఈ సంఘటన జరిగింది.. ఇలాంటి సంఘటనలు తరుచూ జరుగుతుండడంతో దేశ భద్రతపై ప్రజల్లో అనుమానాలు రేకిస్తున్నాయి. వీటి వెనుక ఏదైనా కుట్ర దాగుందా… అనే భయం ప్రజల్లో కలుగుతోంది. ఈ ఘటనపై చర్చ జరుగుతుండగానే తాజాగా ఖమ్మం జిల్లాలోను అలాంటి సంఘటనే జరిగింది. ఆ పావురం […]