కొత్త ఫీచర్తో యూజర్లకు అనేక సౌకర్యాలను తెచ్చిపెడుతోంది ఇన్స్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్. కేవలం మెజేసులు పంపుకొనే ఆప్షన్ నుంచి ఫోన్లో కాలింగ్, వీడియో కాలింగ్, ఫార్వర్డ్ మెసేజ్, వ్యూ వన్స్ లాంటి ఇతర ఎన్నో ఆప్షన్లను తీసుకొస్తూ యూజర్లలో నిరంతరం ఆసక్తి రేకెత్తిస్తోంది. రీసెంట్ గా వాట్సాప్ తెచ్చిన ‘వ్యూ వన్స్’ మోడ్తో మెసేజ్ పంపితే ఇకపై అలా జరగదు. ‘వ్యూ వన్స్’ మోడ్తో ఒకసారి పంపిన వీడియో, ఫోటో, మెసేజ్లను రెసిపెంట్ యూజర్ కేవలం ఒక్కసారి మాత్రమే చూడటానికి వీలు పడుతుంది.
దీంతో యూజర్ పంపిన ఫోటో, వీడియో, మెసేజ్లను రెసిపెంట్ యూజర్ చూడటానికి నియంత్రించే అవకాశం ఏర్పడుతుంది. ప్రస్తుతం ఆండ్రాయిడ్ 2.21.14.3 వెర్షన్లో ఈ సదుపాయాన్ని చూడవచ్చు. భవిష్యత్తులో ఐవోస్ యూజర్ల కోసం కూడా అందుబాటులోకి వస్తుంది. ఈ ఫీచర్ తో ఇక మనం అవతలి వ్యక్తికి ఫోటోని పంపినపుడు ఆ వ్యక్తి ఆ ఫోటోని ఒకసారి మాత్రమే చూడగలడు. ఆ తర్వాత ఆ ఫోటోని ఓపెన్ చేయాలన్న ఆ ఫోటో రెండోసారి కనిపించదు.
ఈ ఫీచర్ వల్ల వినియోగదారునికి ఫోటోల విషయంలో కొంతవరకు ఇబ్బంది పడవచ్చు. వినియోగదారులు వాటిని స్క్రీన్ షాట్ తీసుకోవడం ద్వారా వాటిని స్టోరేజ్లో పెట్టుకునే అవకాశం ఉంది. యాప్ను అప్డేట్ చేసుకోండి. దీంతోపాటు ఐవోఎస్ వినియోగదారులకు కొత్త తరహా ఇన్ యాప్ మెసేజ్ నోటిఫికేషన్లను కూడా వాట్సాప్ అందిస్తుంది. దీనికి సంబంధించిన కొత్త వెర్షన్ యాపిల్ యాప్ స్టోర్లో అందుబాటులో ఉంది. దాన్ని డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా కొత్త ఫీచర్లను ఉపయోగించవచ్చు.