టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ మనిషీ జీవనం ఎంతో సులువైంది. అలాగే అదే టెక్నాలజీతో మనిషికి ఎన్నో ముప్పులు కూడా వస్తున్నాయి. సాంకేతికత ఎంత పెరిగితే హ్యాకర్ల ముప్పు కూడా అంతే పెరుగుతోంది. తాజాగా గూగుల్ ప్లే స్టోర్ ఆండ్రాయిడ్ యూజర్స్ కు కీలక సూచన చేసింది. వారి ఫోన్స్ లో మాల్ వేర్ ఉండే ఈ యాప్ ను వెంటనే తొలగించాలని సూచించింది. ‘కలర్ మెసేజ్’ పేరుతో ఉండే ఈ యాప్ ద్వారా మీ ఫోన్ లోకి జోకర్ మాల్ వేర్ ప్రవేశించే ముప్పు ఉన్నట్లు సూచించింది.
యాప్ పరంగా కలర్ మెసేజ్ ద్వారా కొత్త టెక్ట్సింగ్ ఎక్స్ పీరియన్స్ పొందొచ్చని యాప్ డెవలపర్స్ చెబుతున్నారు. అయితే ఈ యాప్ డౌన్ లోడ్ చేశాక.. హ్యాకర్స్ జోకర్ మాల్ వేర్ ను ఫోన్లలో ప్రవేశపెడుతున్నట్లు వెల్లడించారు. యూజర్ల ప్రమేయం లేకుండా ప్రీమియం సేవలను సబ్ స్క్రైబ్ చేస్తున్నట్లు గురించారు.
దాని ద్వారా యూజర్ బ్యాంకింగ్ డీటెయిల్స్, వ్యక్తిగత వివరాలు సైతం బహిర్గతమౌతున్నట్లు హెచ్చరించారు. ఇప్పటికే కలర్ మెసేడ్ యాప్ ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి నిషేధించారు. అయినా ఇప్పటికే ఎవరైనా డౌన్ లోడ్ చేసుకునుంటే దానిని వెంటనే అన్ ఇన్ స్టాల్ చేయాల్సిందిగా సూచిస్తున్నారు. 2017లో ఈ జోకర్ మాల్ వేర్ ను కనుగొన్నారు. గూగుల్ ప్లే స్టోర్ హ్యాకర్స్ ను కట్టడి చేసేందుకు ఎన్ని యాప్స్ ను నిషేదిస్తున్నా.. హ్యాకర్స్ మరో కొత్త యాప్ తో దాడికి దిగుతున్నారు. మీ మొబైల్ లో ఈ కలర్ మెసేజ్ యాప్ ఉందా? ఉంటే వెంటనే అన్ ఇన్ స్టాల్ చేయండి.