ఇప్పుడు అందరూ ఇ-కామర్స్ సైట్స్ నుంచి కొనుగోళ్లు చేస్తున్నారు. అంతా ఆన్ లైన్ షాపింగ్ కే అలవాటు పడిపోయారు. అయితే కొన్ని స్పెషల్ డేస్ లో ఈ వెబ్ సైట్లు ప్రత్యేక డిస్కౌంట్స్, ఆఫర్స్ ప్రకటిస్తూ ఉంటాయి. ఇప్పుడు ఫ్లిప్ కార్ట్ నుంచి బిగ్ సేల్ ఒకటి నడుస్తోంది.
ఇ-కామర్స్.. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే మాట. ఎందుకంటే ప్రజలు వారకి కావాల్సిన అన్ని వస్తువులను ఆన్ లైన్ లోనే కొనుగోలు చేసుకుంటున్నారు. అందుకే ఇ-కామర్స్ సైట్లకు బిజినెస్ బాగా పెరిగింది. కస్టమర్స్ ని ఆకట్టుకునేందుకు ఇ-కామర్స్ సైట్స్ వాళ్లు ఆఫర్స్, డిస్కౌంట్స్ కూడా ప్రకటిస్తూ ఉంటారు. ఏదైనా స్పెషల్ డే ఉంటే అప్పుడు సేల్ కూడా నిర్వహిస్తూ ఉంటారు. సంక్రాంతి, దసరా, రిపబ్లిక్ డే సేల్ అంటూ భారీ డిస్కౌంట్స్ ప్రకటిస్తూ ఉంటారు. తాజాగా ఫ్లిప్ కార్ట్ సంస్థ హోళీ సందర్భంగా సేల్ నిర్వహిస్తోంది. ఇందులో 80 శాతం వరకు డిస్కౌంట్స్ ప్రకటించారు.
ఫ్లిప్ కార్ట్ సంస్థకు ఇండియాలో చాలా మంది లాయల్ కస్టమర్స్ ఉన్నారు. ఇలాంటి సేల్స్ లో ఫ్లిప్ కార్ట్ ద్వారా ఎంతోమంది వ్యాపారులు లాభాలు పొందుతుంటారు. తాజాగా హోళీ సందర్భంగా బిగ్ సేల్ నిర్వహిస్తోంది. ఇందులో దాదాపుగా 80 శాతం వరకు డిస్కౌంట్స్ ప్రకటించారు. అంతేకాకుండా వివిధ రకాల డిస్కౌంట్స్ ఈ సేల్ లో ఉన్నాయి. మొత్తం లక్షకు పైగా ప్రొడక్టులపై ఈ సేల్ లో డిస్కౌంట్ ఆఫర్స్ ప్రకటించారు. ఈ సేల్ మార్చి 3 నుంచి 5వ తేదీ వరకు సాగనుంది. ఇందులో అండర్ 499, అండర్ 699, అండర్ 799, అండర్ 999 అనే కేటగిరీలు కూడా ఉన్నాయి. ఈ కేటగిరీల్లో అన్ని ఉత్పత్తులను అందిస్తున్నారు.
గ్రోసరీస్ మీద కూడా ఈ సేల్ లో మంచి ఆఫర్స్ ఉన్నాయి. 5 లక్షలకు పైగా బ్యూటీ, గ్రోసరీ, స్పోర్ట్స్ వంటి ప్రొడక్ట్స్ ఉన్నాయి. బేబీ కేర్ ఉత్పత్తులపై 70 శాతం వరకు డిస్కౌంట్, స్పోర్ట్స్- ఫిట్ నెస్ ప్రొడక్టస్ పై 80 శాతం వరకు డిస్కౌంట్, ఫుడ్- బేవరేజెస్ పై 80 శాతం వరకు డిస్కౌంట్, హెయిర్ కేర్ పై 75 శాతం వరకు డిస్కౌంట్స్ ప్రకటించారు. ఇంక స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ కేవలం రూ.49 నుంచే ప్రారంభం అవుతున్నాయి. హోమ్- కిచెన్ ఉత్పత్తులపై కూడా భారీ డిస్కౌంట్స్ నడుస్తున్నాయి. హెడ్ ఫోన్స్ స్పీకర్స్ పై కూడా 80 శాతం వరకు డిస్కౌంట్ ఉంది. ఏసీలైతే రూ.24,499 నుంచి ప్రారంభం కానున్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం ఫ్లిప్ కార్ట్ అధికారిక వెబ్ సైట్ ద్వారా షాపింగ్ చేసేయండి.