చైనాలో ఓ కంపెనీ సరికొత్త టెక్నాలజీతో అతి చిన్న మొబైల్ ని లాంచ్ చేసింది. చైనాకు చెందిన మోనీ కంపెనీ మింట్ పేరుతో అతి చిన్న సైజులో ఈ ఫోన్ రిలీజ్ చేసింది. ప్రపంచంలో ఉన్న ఎన్నో వైర్లెస్ నెట్వర్క్లను ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుందిట. నెట్ వర్క్ కాల్స్ చేసుకోలేని సమయాల్లో వైర్లెస్ కాల్స్ చేసుకునే అవకాశం ఉంటుంది. దీని బ్యాటరీ సామర్థ్యం 1250 ఎంఏహెచ్గా ఉండగా, 72 గంటల స్టాండ్బై టైంను ఇది అందిస్తుంది.
స్మార్ట్ ఫోన్ సైజ్ ఎంత ఉంటుంది చాలా మంది పెద్ద డిస్ ప్లే ఉండాలని, బెటర్ ఎక్స పీరియన్స్ కోసం, వీడియో క్వాలిటీ కోసం మినిమం 5 అంగుళాల నుంచి 6 అంగుళాలు కోరుకుంటున్నారు. ఈ స్మార్ట్ ఫోన్ కి 3 అంగుళాల డిస్ప్లే మాత్రమే ఉంటుంది. క్రెడిట్ కార్డ్, ఏటీఎం కార్డ్ సైజులో ఈ ఫోన్ ఉంటుంది. ప్రపంచంలోనే అతి చిన్న స్మార్ట్ ఫోన్ ఇది. దీని ధర ఎంతో తెలుసా కేవలం 150 డాలర్ల రూపాయలు.. ఎర్లీ బర్డ్ ఆఫర్ కింద కేవలం 100 డాలర్లకే ఈ ఫోన్ ఇస్తోంది. అంటే కేవలం 7500 కి వస్తోంది.
ఇండీగోగో క్రౌడ్ ఫండింగ్ వెబ్ సైట్ ద్వారా ఈ ఫోన్ అమ్ముతున్నారు. అయితే ఇప్పుడు ఆర్డర్ పెట్టుకుంటే నవంబర్ లో మొబైల్ డెలివరీ అవుతుంది. ఇది 4జీ స్మార్ట్ ఫోన్ . డ్యూయెల్ సిమ్ సపోర్ట్ ఉంది. 3 అంగుళాల డిస్ ప్లే ఉంటుంది. అంతేకాదు 3జీబీ ర్యామ్, 64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. 128జీబీ వరకు స్టోరేజ్ పెంచుకోవచ్చు. ఈ మొబైల్ గూగుల్ ఆండ్రాయిడ్ 9 ఆపరేటింగ్ సిస్టమ్ తో వర్క్ చేస్తుంది.
దాదాపు 72 గంటలు చార్జ్ వస్తుంది. మూడు అంగుళాల డిస్ప్లేను అందించారు. దీని డిజైన్ కూడా చాలా సన్నగా ఉండబోతోంది. యూఎస్బీ టైప్-సీ పోర్టు, వాల్యూమ్ బటన్లు మాత్రమే ఇందులో అందించారు.