బీజీఎంఐ వీడియో గేమ్ త్వరలో భారత్ లో అడుగుపెట్టనుంది. ఈ విషయాన్ని క్రాఫ్టాన్ సంస్థ అధికారికంగా ప్రకటించింది.
పబ్జీ అంటే ఆట కాదు, అదొక ఎమోషన్. ఎంతోమందికి ఈ గేమ్ అంటే పిచ్చి. దీన్నే బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా (బీజీఎంఐ)గా మార్చారు. ఈ వీడియో గేమ్ ని మన దేశంలో బ్యాన్ చేయకముందు ప్రతి నెలా 50 మిలియన్ యాక్టివ్ యూజర్లు ఉండేవారు. ఈ గేమ్ మిగతా ప్లాట్ ఫామ్స్ లో ఉన్న గేమ్స్ ని మించిపోయింది. అయితే ఈ గేమ్ ని ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ పబ్జీని నిషేధించింది. ఐటీ యాక్ట్ 2000 సెక్షన్ 69ఏ కింద కొన్ని భద్రతా కారణాల రీత్యా చైనీస్ యాప్స్ తో పాటు పబ్జీ గేమ్ ను ప్రభుత్వం నిషేధించింది. జూలై 2022లో ఈ గేమ్ ప్లే స్టోర్, యాప్ స్టోర్ నుంచి తొలగించబడింది. దాదాపు ఏడాది తర్వాత మళ్ళీ ఈ పబ్జీ మోడిఫైడ్ వెర్షన్ బీజీఎంఐ మళ్ళీ భారత్ లో అడుగుపెట్టనుంది.
దక్షిణ కొరియా దిగ్గజ సంస్థ క్రాఫ్టాన్ భారత ప్రభుత్వం నుంచి అనుమతులు పొందింది. తిరిగి భారత్ లో బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా ఆపరేషన్ ను తిరిగి కొనసాగించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది భారత ప్రభుత్వం. ఈ విషయాన్ని ‘బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా’ అధికారిక ఫేస్ బుక్ ఖాతాలో వెల్లడించింది. బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా (బీజీఎంఐ) పునఃప్రారంభించేందుకు భారత అధికారులు అనుమతించినందుకు అభినందనలు తెలియజేసింది. చట్టానికి కట్టుబడి ఉండే బాధ్యతాయుతమైన దక్షిణ కొరియా కంపెనీ అయిన క్రాఫ్టాన్.. భారతీయ చట్టాలకు అనుగుణంగా నడుచుకునేందుకు అనేక చర్యలను చేపట్టిందని తెలిపింది.
మా ప్లేయర్లకు సురక్షితమైన మరియు మంచి గేమింగ్ అనుభూతిని అందించేందుకు కట్టుబడి ఉన్నామని.. అత్యున్నత ప్రమాణాలను మెయింటెయిన్ చేసేందుకు కంటిన్యూగా అలసిపోకుండా పని చేస్తామని స్పష్టం చేసింది. భారతీయ గేమింగ్ ఎకో సిస్టమ్ కి కట్టుబడి ఉన్నామని వెల్లడించింది. అలానే తాము ప్రతిభావంతులైన భారతీయులకు స్కిల్స్ ని ప్రొవైడ్ చేసి ఉపాధి అవకాశాల ప్రాధాన్యతలను గుర్తించామని కంపెనీ తెలిపింది. ఇది గేమింగ్ పరిశ్రమల్లో యువకుల స్కిల్స్ ని వృద్ధి చేసుకునేందుకు సహకరిస్తుందని తెలిపింది. త్వరలోనే బీజీఎంఐ గేమ్ అందుబాటులోకి వస్తుందని స్పష్టం చేసింది. మరి బీజీఎంఐ గేమ్ ప్లే స్టోర్, యాపిల్ స్టోర్స్ లో అడుగుపెడుతుండడంపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.