కాలంతో పాటు మానవ జీవన విధానం కూడా ఎంతో వేగం పుంజుకుంది. కాలం వేగంగా పరిగెడుతుందనేది అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీని బట్టే చెప్పవచ్చు. ఒకప్పుడు మాట్లాడేందుకు సెల్ ఫోన్ వచ్చింది. ఇప్పుడు దాని స్థానంలో స్మార్ట్ ఫోన్లు. అదీగాక లాక్ డౌన్ వేళలో మొబైల్ వాడకం ఎక్కువైపోయి ఆయా టెక్నాలజీ కంపెనీలు న్యూ మోడల్స్ మార్కెట్ లో ప్రవేశపెడుతున్నారు.
తాజాగా టెక్ దిగ్గజం ఆపిల్ తన ఐఫోన్ లో సరికొత్త టెక్నాలజీని అందుబాటులో తీసుకురాబోతుంది. యూఎస్ పేటెంట్ అండ్ ట్రేడ్ మార్క్ అధికారిక పోర్టల్ తెలిపిన వివరాల ప్రకారం.. ‘యాపిల్ సంస్థ ఐఫోన్ ఫంక్షనాలిటీని పూర్తిగా మార్చనుందట. ఇప్పటిదాకా ఐఫోన్ స్క్రీన్(డిస్ ప్లే)ని యాప్స్, కాంటాక్ట్స్, పాడ్ కాస్ట్ వినేందుకు వాడుతున్నారు. కానీ ఇకపై ఐఫోన్ స్క్రీన్ బ్యాటరీ ఛార్జర్ గా యాపిల్ సీఈఓ టిమ్ కుక్ మార్చబోతున్నట్లు తెలిపింది. ఒకవేళ ఈ టెక్నాలజీ ఐఫోన్ లో వస్తే యాపిల్ కంపెనీకి చెందిన అన్ని గాడ్జెట్ లను ఐఫోన్ స్క్రీన్ మీద పెట్టి ఛార్జ్ చేసుకోవచ్చు. అయితే.. ఈ కొత్త టెక్నాలజీ పై ఐఫోన్ యూజర్లు షాక్ అవుతున్నారు.‘థ్రూ డిస్ప్లే వైర్ లెస్ ఛార్జింగ్’ ఫీచర్ సాయంతో యాపిల్ ఉత్పత్తులైన ఐఫోన్, ఐపాడ్, ఇయర్ బడ్స్, స్మార్ట్ వాచ్లకు ఛార్జింగ్ పెట్టుకోవచ్చని’ చెబుతున్నారు. ఎప్పుడైనా ఛార్జర్స్ మరిచిపోయినప్పుడు ఈ డిస్ప్లే వైర్లెస్ ఛార్జింగ్ను వాడుకోవచ్చు. అయితే.. ఈ ఫీచర్ యూజ్ చేయాలంటే యాపిల్ ప్రొడక్టులు వైర్ లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేయాల్సి ఉంటుందని సమాచారం. మరి ఈ ఐఫోన్ డిస్ ప్లే ఫీచర్ పై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.