వరుస ఓటములు క్రికెటర్లను బాధిస్తున్నాయి. విజయం కోసం ఎంతలా శ్రమిస్తున్నపటికీ, ఫలితం అనుకూలంగా రాకపోవడం వారిని కంటతడి పెట్టిస్తోంది. ఆ దృశ్యాలు అభిమానుల హృదయాన్ని హత్తుకునేలా ఉన్నాయి.
వేదికలు మారుతున్నాయి.. ప్రత్యర్థులు మారుతున్నారు. కానీ, ఫలితం మాత్రం మారడం లేదు. మహిళల ప్రిమియర్ లీగ్లో అన్ని జట్లూ కనీసం ఒక మ్యాచ్ అయినా గెలిచాయి. కానీ స్మృతి మంధాన సారధ్యంలోని ఆర్సీబి మాత్రం ఇంకా తొలి విజయం కోసం ఇంకా ఎదురుచూస్తూనే ఉంది. సోమవారం ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచులో స్మృతి సేన 6 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. దీంతో ఓటముల సంఖ్య ఐదుకు చేరింది. ఈ ఓటమి బాధ భరించలేని ఓ మహిళా క్రికెటర్ మైదానంలోనే కన్నీరు పెట్టుకుంది.
స్మృతి మంధాన, సోఫి డివైన్, ఎలీసా పెర్రీ, ఎరిన్ బర్న్స్, హేథర్ నైట్, డాన్ వాన్ నెరిక్, రిచా ఘోష్, రేణుకా సింగ్.. వంటి టీ20 స్టార్లు ఉన్నప్పటికీ, ఆర్సీబికి ఓటమి బాధలు తప్పట్లేదు. తొలి మ్యాచులో ముంబై ఇండియన్స్ తో మొదలు.. చివరగా ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన ఐదో మ్యాచ్ వరకూ అన్నింటా పరాజయాలు వెంటాడుతూనే ఉన్నాయి. సోమవారం జరిగిన పోరులో ఢిల్లీ 6 వికెట్ల తేడాతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై గెలుపొందింది. తొలుత బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేయగా, ఢిల్లీ క్యాపిటల్స్ 19.4 ఓవర్లలో ఆ లక్ష్యాన్ని చేధించింది.
Tough times continue for RCB. pic.twitter.com/6GKDxacoi0
— Johns. (@CricCrazyJohns) March 13, 2023
ఈ మ్యాచ్ అమాంతం అన్నింటా ఎమోషనల్ సీన్స్ తలపించాయి. బంతి బౌండరీకి వెళ్లిన ప్రతిసారి ఆర్సీబి క్రికెటర్లు నిరుత్సాహ పడుతూనే ఉన్నారు. మ్యాచును ప్రత్యక్షంగా వీక్షించిన ప్రతి అభిమాని వీరి ఎమోషన్ చూసి బాధపడ్డారనే చెప్పాలి. వరుస ఓటములతో ఒకప్పుడు విరాట్ కోహ్లీ ఎంతలా కుమిలిపోయాడో.. అలాంటి దృశ్యాలే మరోసారి కనిపించాయి. సారథి మంధాన తలదించుకొని బాధపడగా, ఎల్లిస్ పెర్రీ మైదానంలోనే కంటతడి పెట్టుకుంది. ఆ దృశ్యాలు చూశాక, సగటు క్రికెట్ అభిమానిగా ప్రతి ఒక్కరూ ఆర్సీబీ విజయం కోసం అర్థించేవారే.
.
Ellyse Perry and Virat Kohli giving their best for RCB but sadly on losing side pic.twitter.com/GE3BbNJT7p
— leishaa ✨ (@katyxkohli17) March 13, 2023
టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఆర్సీబీకి ఆదిలోనే షాక్ తగిలింది. ఎప్పటిలానే స్మృతి మంధాన(8) మరోసారి విఫలమైంది. మొదట ఆచితూచి ఆడినా.. చివరకు పేలవ షాట్ తో పెవిలియన్ చేరింది. మొదట 10 ఓవర్లు ముగిసేసరికి 50/2. ఇలాంటి సమయంలో ఘోర ఓటమి తప్పదనుకున్నప్పటికీ, ఎల్లిస్ పెర్రీ(67 నాటౌట్; 52 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్లు) రాణించడంతో ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది. ఒకరిద్దరు మాత్రమే రాణిస్తుండటం జట్టు ఓటములపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఎల్లిస్ పెర్రీ, రిచా ఘోష్ తప్ప బ్యాటింగ్ లో ఎవరు రాణించలేకపోతున్నారు. ఇక ఆర్సీబీ మహిళా బౌలర్లు.. అబ్బాయిల జట్టుకు ఏమాత్రం తీసిపోరు. ఇప్పటికే ఐదు మ్యాచుల్లో ఓటమి చవిచూసిన ఆర్సీబీ ప్లే ఆప్స్ చేరడం కష్టంగానే కనిపిస్తోంది. ఈ విషయంపై.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Brilliant hitting from Ellyse Perry – 67* in 52 balls. RCB scored over 80 runs in the last 6 overs. pic.twitter.com/1PvmrUc7fM
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 13, 2023