న్యూజిలాండ్ గడ్డపై జరుగుతున్న మహిళల వన్డే ప్రపంచకప్లో భారత్ జట్టు బోణి అదిరిపోయింది. ఈ మెగాటోర్నీలో భాగంగా నేడు మౌంట్ మాంగనూయ్ వేదికగా ఆదివారం(మార్చి 6) పాకిస్థాన్తో తలపడిన భారత్ జట్టు.. 107 పరుగుల తేడాతో అలవోక విజయాన్ని అందుకుంది. ఉమెన్స్ క్రికెట్లో భారత్, పాకిస్థాన్ జట్లు ఇప్పటి వరకూ 11 వన్డేల్లో తలపడగా.. అన్నిమ్యాచ్ల్లోనూ భారత్ అమ్మాయిలే గెలిచారు. ఇక వన్డే ప్రపంచకప్లో ఇప్పటివరకు మూడు సార్లు తలపడగా.. మూడు సార్లూ పాక్ని చిత్తు చేశారు.
మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 244 పరుగులు సాధించింది. పూజా వస్త్రాకర్(67, 59 బంతుల్లో 8×4, స్నేహ్ రానా(53*, 48 బంతుల్లో 4×4), స్మృతి మంధాన(52, 75 బంతుల్లో 3×4, 1×6) పరుగులతో రాణించారు. అనంతరం 245 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన పాకిస్థాన్ జట్టు.. ఏ దశలోనూ పాకిస్థాన్ గెలిచేలా కనిపించలేదు. భారత్ స్పిన్నర్ రాజేశ్వరి గైక్వాడ్ (4/31) దెబ్బకి 137 పరుగులకే కుప్పకూలిపోయింది. ఆ జట్టులో కనీసం ఒక్క బ్యాటర్ కూడా చెప్పుకోదగ్గ స్కోరు చేయలేకపోయారు. భారత బౌలర్లలో గోస్వామి, స్నేహ్ రానా తలో రెండు వికెట్లు, రాజేశ్వరి గైక్వాడ్ 4 వికెట్లు, దీప్తి శర్మ, మేఘనా సింగ్ తలో ఒకటి వికెట్ పడగొట్టారు.
That’s that from #INDvPAK game at #CWC22.
Pakistan are bowled out for 137 in 43 overs.#TeamIndia WIN by 107 runs.
Scorecard – https://t.co/ilSub2ptIC #INDvPAK #CWC22 pic.twitter.com/jmP7xCPowi
— BCCI Women (@BCCIWomen) March 6, 2022
245 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన పాకిస్థాన్ జట్టు.. ఓపెనర్ అమ్రీన్ (30) పరుగులతో రాణించగా.. జావేరియా ఖాన్ (11), బిష్మాహ్ మరూప్ (15), ఓమైమా (5), నీదా దార్ (4), అలియా రజా (11), పాతిమా సనా (17), సిద్రా నవాజ్ (12) వరుసగా వికెట్లు చేజార్చుకున్నారు. అయితే.. ఆఖర్లో డయానా బేగ్ (24: 35 బంతుల్లో 2×4) కాసేపు పోరాడినప్పటికీ..మరో వైపు నుచి సపోర్ట్ లభించలేదు. భారత బౌలర్లు క్రమశిక్షణగా బౌలింగ్ చేసి.. వరుస విరామాల్లో వికెట్లు తీస్తూ పాక్కి చివరి వరకూ పుంజుకునే అవకాశమే ఇవ్వలేదు. ఈ మ్యాచుతో మిథాలీరాజ్.. సచిన్ టెండూల్కర్, జావేద్ మియాందాద్ తర్వాత ఆరు వన్డే ప్రపంచకప్లు ఆడిన మూడో క్రికెటర్ గా అవతరించింది.