మహిళలు అలంకార ప్రియులు. తమ శారీరక సౌందర్యాన్ని కాపాడుకునేందుకు సౌందర్య ఉత్పత్తులను వినియోగించుకున్నట్లే.. తాము ధరించే దుస్తుల విషయంలో కూడా జాగ్రత్తలు, మెళుకువలు తీసుకుంటారు. చీర, కుర్తీ, మిడ్డీ, ఫ్రాక్స్ డ్రెస్ ఏదైనా కంఫర్టబులిటీ చూసుకుంటారు.
రెండు కొప్పులు ఒక చోట ఉండకూడదని సామెత. ఇద్దరు ఆడవాళ్లు ఒక్క చోట ఉండే గొడవలు అయ్యాయి,అవుతాయన్న ఉద్దేశంతో ఈ సామెత పుట్టుకొచ్చింది. దాన్ని నిజం చేస్తూ కొన్ని సంఘటనలు కూడా జరిగాయి. నీళ్ల కుళాయి దగ్గర నుండి..
ఈ మధ్యకాలంలో అధిక బరువుతో బాధపడే వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. ముఖ్యంగా మహిళలు, చిన్న పిల్లలు అధిక బరువు సమస్యతో బాధ పడుతున్నారు. ఇలాంటి సమయంలోనే మీ బరువు తగ్గిస్తామంటూ వెయిట్ లాస్ సంస్థలు మార్కెట్ లోకి చాలానే వచ్చాయి. అయితే వీటిపై కూడా అనేక విమర్శలు వస్తున్నాయి.
ఓటు కోసం మహిళలను కాకా పడుతుంటారు నేతలు. వారు లేనిద సృష్టి లేదంటూ పొగడ్తలతో ముంచెత్తుతారు. కానీ వాస్తవంలోకి వచ్చేసరికి తమ సమస్యలు ఇవనీ చెబితే పట్టించుకోరు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు దిక్కు ఉండరు. తిరిగి వాళ్లు ఎలా బతకాలో, ఏ డ్రస్ వేసుకోవాలో చెబుతుంటారు మన నేతలు. తాజాగా అమ్మాయిల డ్రస్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఓ నేత.
మహిళలు, విద్యార్థినుల కోసం పలు రాష్ట్రాలు ప్రత్యేక బస్సులను నడుపుతుంటాయి. మహిళలు సాధికారిత వైపుగా అడుగులు వేసేందుకు తోడ్పాటునందిస్తాయి. కొన్ని సార్లు ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని మహిళలకు రవాణా సౌకర్యాల్లో రాయితీలు కల్పిస్తుంటాయి ప్రభుత్వాలు. వచ్చే నెల నుండి మహిళలు, విద్యార్థినులు ఉచిత ప్రయాణం అందించే అవకాశం కల్పించింది ఈ ఏడాది ఎన్నికల బరిలో దిగుతున్న కర్ణాటక ప్రభుత్వం, తాజాగా మరో ప్రభుత్వం మహిళల కోసం రాయితీలను ప్రకటించింది.
భారత మహిళల జట్టు సంచలనం సృష్టించింది. టీ20ల్లో ఈ ఏడాది పరాజయమంటేనే తెలియని ఆస్ట్రేలియాకి ఓటమి రుచిని చవిచూపించారు. ఆస్ట్రేలియా- భారత్ మధ్య 5 టీ20ల సిరీస్ నడుస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా జరిగిన రెండో టీ20లో భారత మహిళల జట్టు ఘన విజయం నమోదు చేసింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్.. ఆస్ట్రేలియాని కట్టడి చేయడంలో కాస్త తడబడింది. తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా వికెట్ నష్టానికి 187 పరుగులు చేసింది. హేలీ […]
భూమి మీద జీవించే ప్రతి ప్రాణికి గాలితో పాటు నీరు చాలా ముఖ్యం. నీటికోసం దేశాల, రాష్ట్రాల మధ్య యుద్ధాలు సైతం జరుగుతుంటాయి. అనేక ప్రాంతాల్లో నీటి కొరత అక్కడి వారిని తీవ్రంగా వేధిస్తుంది. గుక్కెడు నీళ్ల కోసం మైళ్ల దూరం నడుచుకుంటూ వెళ్తుంటారు. మనదేశంలోను అనేక ప్రాంతాల్లో నీటి కొరత ప్రధాన సమస్యగా ఉంది. గుక్కెడు నీళ్ల కోసం తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఎండిపోయిన బావిలో మహిళలు దిగడటమే నీటి కొరతకు నిదర్శనం. […]
న్యూజిలాండ్ గడ్డపై జరుగుతున్న మహిళల వన్డే ప్రపంచకప్లో భారత్ జట్టు బోణి అదిరిపోయింది. ఈ మెగాటోర్నీలో భాగంగా నేడు మౌంట్ మాంగనూయ్ వేదికగా ఆదివారం(మార్చి 6) పాకిస్థాన్తో తలపడిన భారత్ జట్టు.. 107 పరుగుల తేడాతో అలవోక విజయాన్ని అందుకుంది. ఉమెన్స్ క్రికెట్లో భారత్, పాకిస్థాన్ జట్లు ఇప్పటి వరకూ 11 వన్డేల్లో తలపడగా.. అన్నిమ్యాచ్ల్లోనూ భారత్ అమ్మాయిలే గెలిచారు. ఇక వన్డే ప్రపంచకప్లో ఇప్పటివరకు మూడు సార్లు తలపడగా.. మూడు సార్లూ పాక్ని చిత్తు చేశారు. […]