భారత మహిళల జట్టు సంచలనం సృష్టించింది. టీ20ల్లో ఈ ఏడాది పరాజయమంటేనే తెలియని ఆస్ట్రేలియాకి ఓటమి రుచిని చవిచూపించారు. ఆస్ట్రేలియా- భారత్ మధ్య 5 టీ20ల సిరీస్ నడుస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా జరిగిన రెండో టీ20లో భారత మహిళల జట్టు ఘన విజయం నమోదు చేసింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్.. ఆస్ట్రేలియాని కట్టడి చేయడంలో కాస్త తడబడింది. తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా వికెట్ నష్టానికి 187 పరుగులు చేసింది. హేలీ కేవలం 25 పరుగులకే అవుట్ కాగా.. మూనీ(82*), తాలియా మెగ్రాత్(70*) విజృంభించారు. వెరసి టీమిండియా విజయ లక్ష్యం 20 ఓవర్లలో 188 పరుగులు అయ్యింది.
ఛేజింగ్ లో స్మృతి మందాన మంచి స్టార్ట్ ని అందించింది. 49 బంతుల్లోనే 4 సిక్సులు, 9 ఫోర్ల సాయంతో 79 పరుగులు చేసింది. షఫల్లా వెర్మా కూడా.. 23 బంతుల్లోనే 34 పరుగులు చేసి పర్వాలేదనిపించింది. ఆ తర్వాత హర్మన్ ప్రీత్ కౌర్(21), రిచా ఘోష్(26) మ్యాచ్ ని లాక్కొచ్చారు. దేవికా వైద్య(11*) మ్యాచ్ లో కీలక పాత్ర పోషించింది. 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేయగలిగారు. మొత్తానికి మ్యాచ్ స్కోర్ ని టై చేయగలిగారు. ఇంక తర్వాత సూపర్ ఓవర్ కు వెళ్లారు.
WHAT. A. MATCH 💥#TeamIndia beat Australia in the Super Over 🙌
Series now tied at 1-1 👍 #INDvAUS
Scorecard 👉 https://t.co/2OlSECwnGk… pic.twitter.com/P6kyZYjgQc
— BCCI Women (@BCCIWomen) December 11, 2022
భారత్ తరఫున స్మృతి మందనా, ఘోష్ బ్యాటింగ్ కు వచ్చారు. మొదటి హంతినే సిక్సుగా మలిచి ఘోష్ ఆటలో జోష్ పెంచింది. తర్వాత బంతికే ఘోష్ అవుట్ అవ్వడంతో అంతా ఆందోళన చెందారు. తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన కౌర్ మూడో బంతికి సింగిల్ తీసుకుంది. నాలుగో బంతిని మందనా ఫోర్ గా మలిచింది. 5వ బంతికి సిక్సర్ కొట్టగా.. 6వ బంతికి 3 పరుగులు చేశారు. మొత్తానికి సూపర్ లో ఓవర్లో వికెట్ నష్టానకిి 20 పరుగులు చేశారు. తర్వాత ఛేజింగ్ కి వచ్చిన ఆస్ట్రేలియాని హేలీ గార్డెనర్ బ్యాటింగ్ కి రాగా మూడో బంతికి గార్డనర్ అవుట్ అయ్యింది. సూపర్ ఓవర్లో ఆస్ట్రేలియా జట్టు కేవలం 16 పరుగులే చేయగలిగింది. హర్మన్ సేన సూపర్ ఓవర్లో సూపర్ విక్టరీని అందుకుంది. ఈ విజయంతో ఈ ఏడాదిలో పరాజయమంటే తెలియని ఆస్ట్రేలియాకి హర్మన్ జట్టు ఓటమిని పరిచయం చేేశారు. ఈ సిరీస్ ప్రస్తుతం 1-1తో సమానం అయ్యింది.
A victory lap to honour the crowd who were in attendance to support the women in blue
Over 47,000 in attendance for the second T20I who witnessed a thriller here at the DY Patil Stadium 👏 👏
Keep cheering for Women in Blue 👍 👍#TeamIndia | #INDvAUS | @mastercardindia pic.twitter.com/CtzdsyhxZu
— BCCI Women (@BCCIWomen) December 11, 2022
Here’s a special message from #TeamIndia vice-captain @mandhana_smriti on receiving the support of fans in the thrilling second #INDvAUS T20I 👌👌 pic.twitter.com/aBLSMJ2QeO
— BCCI Women (@BCCIWomen) December 11, 2022