మహిళల టీ20 ప్రపంచ కప్ లో పోరులో టీమిండియా పోరాటం ముగిసింది. ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్ పోరులో భారత్ 5 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 173 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించగా, అనంతరం బ్యాటింగ్ కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి 167 పరుగులకే పరిమితమయ్యింది.
మహిళల టీ20 ప్రపంచ కప్ లో పోరులో టీమిండియా పోరాటం ముగిసింది. ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్ పోరులో భారత్ 5 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 173 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించగా, అనంతరం బ్యాటింగ్ కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి 167 పరుగులకే పరిమితమయ్యింది. టీమిండియా మహిళా సారథి హర్మన్ ప్రీత్ కౌర్(52) హాఫ్ సెంచరీ, జెమీమా రోడ్రిగ్స్(43; 24 బంతుల్లో 6 ఫోర్లు) మెరుపులు జట్టుకు విజయాన్ని అందించలేకపోయాయి. దీంతో భారత్ సెమీస్ తోనే తన పోరాటాన్ని మరోసారి ముగించింది.
తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కంగారుల జట్టు 20 ఓవర్లలో నష్టానికి 172 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ బెత్ మూనీ (54: 37 బంతుల్లో, 7 ఫోర్లు, ఒక సిక్సర్) అర్థ సెంచరీ సాధించగా,సారధి మెగ్ లానింగ్ (49 నాటౌట్: 34 బంతుల్లో, 4 ఫోర్లు, 2 సిక్సర్లు), యాష్లే గార్డ్నర్తో (31: 18 బంతుల్లో, ఐదు ఫోర్లు) మెరుపులు మెరిపించారు. ఒకానొక సమయంలో వరుస వికెట్లు తీసి మ్యాచ్ పై పట్టు బిగించినా పేలవ ఫీల్డింగ్ భారీ ఇన్నింగ్స్ కారణమయ్యింది. భారత బౌలర్లలో శిఖా పాండే రెండు వికెట్లు పడగొట్టగా, రాధా యాదవ్, దీప్తి శర్మ చెరో వికెట్ తీసుకున్నారు.
💔 Kaur #INDWvsAUSW pic.twitter.com/nYRRBKbXA2
— CricTracker (@Cricketracker) February 23, 2023
We lost the game here. #INDWvsAUSW pic.twitter.com/eABamWCjQk
— S. (@Sobuujj) February 23, 2023
అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ కు మంచి శుభారంభం లభించలేదు. పవర్ ప్లే ముగిసేలోపే 3 కీలక వికెట్లు కోల్పోయింది. డ్యాషింగ్ ఓపెనర్ షఫాలీ వర్మ (9) మొదటి ఓవర్లోనే ఎల్బీ డబ్ల్యూగా పెవిలియన్ చేరగా, మరో ఓపెనర్ సృతి మంధాన రెండో ఓవర్లో 2 పరుగుల వద్ద సేమ్ టు సేమ్ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగింది. యస్తికా భాటియా 4 పరుగుల వద్ద రనౌట్ రూపంలో పెవిలియన్ చేరింది. ఈ క్రమంలో జెమీమా- హర్మన్ ప్రీత్ జోడీ ఆస్ట్రేలియా బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. 97 పరుగుల వద్ద జెమీమా(43) వెనుదిరిగినా హర్మన్ ప్రీత్ కౌర్(52) హాఫ్ సెంచరీతో మ్యాచ్ పై ఆశలు రేగాయి. అయితే, అనూహ్య రీతిలో కౌర్ రనౌట్ గా వెనుదిరగడంతో మ్యాచ్ ఆస్ట్రేలియా వశమైంది. ఆసీస్ బౌలర్లలో గార్డ్నర్ 2, డార్సీ బ్రౌన్ 2 చెరో రెండు వికెట్లు తీసుకోగా, జెస్ జోనాసెన్ ఒక వికెట్ తీసుకుంది.
Australia Women are through to yet another Final of the Women’s T20 World Cup. They knock out India after winning the match by 5 runs.#Australia #AustraliaWomen #INDWvsAUSW pic.twitter.com/cyn68lWwsP
— CricTracker (@Cricketracker) February 23, 2023