బంగ్లాదేశ్ వేదికగా జరుగుతోన్న మహిళల ఆసియా కప్ 2022 టోర్నీలో శ్రీలంక జట్టు సంచలన విజయాన్ని నమోదుచేసింది. ప్రత్యర్థి జట్టులోని ఆరుగురు బ్యాటర్లను సున్నాకే పరిమితం చేసి రికార్డు సృష్టించింది. తొలుత శ్రీలంకను తక్కువ పరుగులకే కట్టడి చేసిన మలేషియా జట్టు.. ఆ స్వల్ప లక్ష్యాన్ని కూడా చేధించలేకపోయింది. లంక నిర్ధేశించిన 106 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో 33 పరుగుల వద్ద ఆలౌట్ అయ్యింది. ఫలితంగా లంక జట్టు 72 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. మలేషియా ఇన్నింగ్స్ లో 9 మంది బ్యాటర్లు కలిసి 5 పరుగులు చేయడం గమనార్హం.
ఆసియా కప్ 2022 టోర్నీలో భాగంగా ఇవాళ శ్రీలంక, మలేషియా జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 105 పరుగులు చేసింది. ఆటపట్టు(21), డిసిల్వా(21), రణసింఘే(23) పరుగులతో రాణించారు. అనంతరం 106 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన మలేషియా జట్టు 9.5 ఓవర్లలో 33 పరుగుల వద్ద ఆలౌట్ అయ్యింది. మలేషియా బ్యాటర్లలో ఎల్సా హంటర్(18; 15 బంతుల్లో, 2 ఫోర్లు) హైయెస్ట్ స్కోరర్ కాగా అరుగులు బ్యాటర్లు డకౌట్ గా వెనుదిరిగారు. శ్రీలంక బౌలర్లలో మల్షా షెహణీ 2 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టగా, రణవీర 2, కుమారి 2, రణసింఘే 1తో రాణించారు.
Women’s Asia Cup 2022,
Sri Lanka Woman vs Malaysia Woman pic.twitter.com/UMG4ph3B4y— Govardhan Reddy (@gova3555) October 8, 2022
కాగా, మరో మ్యాచులో భారత మహిళల జట్టు బంగ్లాదేశ్ విమెన్ పై 56 పరుగుల తేదతో విజయం సాధించింది. పాక్తో జరిగిన మ్యాచ్లో ఓటమి తర్వాత మళ్లీ బంగ్లాదేశ్పై విజయాన్ని అందుకొని మళ్లీ విజయాల బాట పట్టింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేయగా, బంగ్లాదేశ్ 7 వికెట్ల నష్టానికి 100 పరుగులు చేయగలిగింది. హాఫ్ సెంచరీతో రాణించిన షెఫాలీ వర్మకు(55; 44 బంతుల్లో, 5 ఫోర్లు, 2 సిక్సులు) ప్లేయర్ అఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ విజయంతో భారత జట్టు సెమీస్ కు అర్హత సాధించింది.
.@TheShafaliVerma bags the Player of the Match award for her cracking half-century at the top against Bangladesh. 👏🏻👏🏻#TeamIndia | #AsiaCup2022 | #INDvBAN pic.twitter.com/jivVYE5Gsa
— BCCI Women (@BCCIWomen) October 8, 2022