యంగ్ టాలెంటెడ్ క్రికెటర్ పృథ్వీ షా.. భారత్కు దొరికిన మరో వీరేంద్ర సెహ్వాగ్గా పేరు తెచ్చుకున్నాడు. ఓపెనర్ బ్యాటర్గా పవర్ప్లేలో పవర్ ఫుల్ షాట్లు ఆడటంలో పృథ్వీ దిట్టా. ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడుతూ దుమ్మురేపుతున్నా.. టీమిండియాలో మాత్రం తన స్థానం సుస్థిరం చేసుకోలేకపోయాడు. తనకు దొరికిన ఒకటీ రెండు అవకాశాల్లో దారుణంగా విఫలం అయ్యాడు. ఐపీఎల్తో పాటు ఇండియా-ఏ, దేశవాళీ టోర్నీల్లోనూ మంచి ప్రదర్శన కనబరుస్తున్న పృథ్వీ షా.. జాతీయ జట్టుకు మాత్రం ఎంపిక కావడం లేదు. 22 ఏళ్ల ఈ ఆటగాడు జాతీయ జట్టుకు ఎంపికకాకపోవడంపై స్పందిస్తూ.. కొంత ఆవేదనకు గురయ్యాడు. దేశవాళీతో పాటు, ఇండియా-ఏకు ఆడుతూ మంచి రన్స్ చేస్తున్నా.. తనను సెలెక్టర్లు పట్టించుకోవడం లేదని పేర్కొన్నాడు.
ఈ సందర్భంగా పృథ్వీ షా మాట్లాడుతూ.. ‘దేశవాళీలో జరిగే అన్ని టోర్నీల్లో మంచి ప్రదర్శన కనబరుస్తున్నాను. జట్టుకు అవసరమైన ఇన్నింగ్స్లను ఆడుతున్నా.. అయినా సరే సెలెక్టర్లు నన్ను పరిగణంలోకి తీసుకోవడం లేదు. అయినా సరే.. వాళ్లు ఎప్పుడు నేను టీమిండియాకు అవసరమని భావిస్తారో.. అప్పుడే నన్ను ఎంపిక చేస్తారు. అప్పటి వరకు నేను ఎదురుచూస్తుంటాను. టీమిండియాకు ఎంపిక అవ్వడానికి ఒక వైపు పరుగులు చేస్తూనే.. మరోవైపు ఫిట్నెస్పై పూర్తి దృష్టి పెట్టాను. ఐపీఎల్ 2022 తర్వాత 6 కిలోల బరువు తగ్గాను. ఫుడ్ విషయంలో కూడా చాలా కేర్ తీసుకున్నా.. ఇప్పటికే కూల్డ్రింక్స్, స్వీట్స్ను పూర్తిగా దూరం పెట్టేశాను. ఇక చైనీస్ ఫుడ్ను కూడా మెనూలోంచి పూర్తిగా తొలగించాను.’ అని అన్నాడు.
ఐపీఎల్ 2022లో ఆశించిన స్థాయిలో ప్రదర్శన చేయని పృథ్వీ షా.. ఇటివల ఇండియా-ఏ తరఫున ఆడిన మంచి స్కోర్లు సాధించాడు. అలాగే దేశవాళీ టోర్నీల్లోనూ సత్తా చాటుతున్నాడు. కాగా.. త్వరలో ప్రారంభం కానున్న ముస్తక్ అలీ ట్రోఫీకి సిద్ధమవుతున్న పృథ్వీ షా మీడియాతో మాట్లాడుతూ.. పై విధంగా స్పందించాడు. ప్రస్తుతం టీ20 వరల్డ్ కప్ వేటలో ఉంది. కాగా.. ఐర్లాండ్, జింబాబ్వేతో జరిగిన సిరీస్లకు సైతం పృథ్వీ షాను సెలెక్టర్లు ఎంపిక చేయలేదు. కనీసం సౌతాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్కైనా ఎంపిక చేస్తారని భావిస్తే.. అది కూడా జరగలేదు.
Prithvi Shaw says he has lost 7-8 kgs since the IPL 👀#IPL #PrithviShaw #CricketTwitter pic.twitter.com/q1AeSMK01N
— CricXtasy (@CricXtasy) October 8, 2022