విండీస్ టూర్లో టీమిండియా వరస విజయాలకు బ్రేక్ పడింది. ఇప్పటికే వన్డే సిరీస్ను క్లీన్ స్వీప్ చేసి టీ20 సిరీస్ను విజయంతో ప్రారంభించిన రోహిత్ సేన రెండో టీ20లో తేలిపోయింది. విచిత్ర కారణాలతో సోమవారం మూడు గంటలు ఆలస్యంగా ప్రారంభమైన మ్యాచ్లో వెస్టిండీస్ 5 వికెట్ల తేడాతో గెలిచింది. ఈ విజయంతో ఐదు టీ20ల సిరీస్లో 1-1తో సమంగా నిలిచింది.
కాగా ఈ మ్యాచ్లో టీమిండియా ఓటమికి బ్యాటింగ్ వైఫల్యమే ప్రధాన కారణమైనా.. ఆవేశ్ ఖాన్ చేసిన ఒక తప్పిదం కూడా టీమిండియా ఓటమికి కారణమైంది. కీలక సమయంలో ఆవేశ్ ఖాన్ నో బాల్ వేయడం భారత్ విజయవకాశాలను దెబ్బతీసింది. ఇక ఈ మ్యాచ్లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా.. 19.4 ఓవర్లలో 138 పరుగులకే కుప్పకూలింది. హార్దిక్ పాండ్యా(31 బంతుల్లో ఫోర్, 2 సిక్స్లతో 31), రవీంద్ర జడేజా(30 బంతుల్లో ఫోర్తో 27) టాప్ స్కోరర్లుగా నిలవగా.. మిగతా బ్యాటర్లంతా విఫలయ్యారు.
ఒబెడ్ మెక్కాయ్ 4 ఓవర్లలో కేవలం 17 పరుగులు ఇచ్చి 6 వికెట్లు పడగొట్టి భారత్ పతనాన్ని శాసించాడు. ఈ లెఫ్టార్మ్ పేసర్ ధాటికి భారత బ్యాటర్లు పెవిలియన్కు క్యూ కట్టారు. ఇన్నింగ్స్ ఫస్ట్ బాల్కే రోహిత్ శర్మ గోల్డెన్ డక్ అయ్యాడు. సూర్య కుమార్ యాదవ్(11), శ్రేయస్ అయ్యర్(10) కెప్టెన్ను అనుసరించారు. రిషభ్ పంత్(24), హార్దిక్ కొంత పోరాడినా హోస్సెన్ దెబ్బతీసాడు. చివర్లో అశ్విన్, కార్తీక్ కూడా విఫలమవడంతో టీమిండియా స్వల్ప స్కోర్కే పరిమితమైంది.
మెక్కాయ్ 6 వికెట్లతో పాటు హోల్డర్ రెండు వికెట్లు పడగొట్టాడు. హోస్సెన్, జోసఫ్ తలో వికెట్ తీసుకున్నారు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన వెస్టిండీస్ 19.2 ఓవర్లలో 5 వికెట్లకు 141 పరుగులు చేసింది. ఓపెనర్ బ్రాండన్ కింగ్(52 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్లతో 68)హాఫ్ సెంచరీతో రాణించగా.. డేవన్ థామస్(19 బంతుల్లో ఫోర్, 2 సిక్స్లతో 31 నాటౌట్) విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు. కైల్ మేయర్స్(8), నికోలస్ పూరన్(14), షిమ్రాన్ హెట్మైర్(6), రోవ్మన్ పొవెల్(5) విఫలమయ్యారు.
భారత బౌలర్లలో అర్షదీప్ సింగ్, జడేజా, అశ్విన్, హార్దిక్ పాండ్యా, ఆవేశ్ ఖాన్ తలో వికెట్ తీశారు. స్వల్ప లక్ష్యమే అయినా మ్యాచ్ను భారత్ ఆఖరి ఓవర్ వరకు తీసుకెళ్లింది. చివరి మూడు ఓవర్లలో విండీస్ విజయానికి 27 పరుగులు అవసరమవ్వగా.. 18వ ఓవర్ వేసిన హార్దిక్ 11 పరుగులిచ్చాడు. ఇక 19వ ఓవర్ వేసిన అర్షదీప్.. డేంజరస్ పోవెల్ను ఔట్ చేయడంతో పాటు 6 పరుగులు మాత్రమే ఇవ్వడంతో ఆశలు రేకెత్తాయి. చివరి ఓవర్లో విండీస్ విజయానికి 10 పరుగులు అవసరమవ్వగా.. బంతిని అందుకున్న ఆవేశ్ ఖాన్ తొలి బంతినే నోబాల్గా వేశాడు.
దాంతో ఫ్రీ హిట్ అవకాశాన్ని అందుకున్న డెవన్ థామస్ భారీ సిక్సర్ బాదాడు. అదే జోరులో మరో బౌండరీ బాది మ్యాచ్ను ముగించాడు. ఇక్కడ ఆవేశ్ ఖాన్ నో బాల్ వేయకుండా కట్టుదిట్టంగా బంతులు వేసుంటే మ్యాచ్ మరింత ఉత్కంఠగా మారి విండీస్ బ్యాటర్లు ఒత్తిడికి గురయ్యేవారు. అప్పుడు భారత్ విజయానికి అవకాశం ఉండేది. కానీ అలా జరగలేదు. మరి ఈ మ్యాచ్లో టీమిండియా ఓటమిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
#TeamIndia put up a solid fight but it was the West Indies who won the second #WIvIND T20I.
We will look to bounce back in the third T20I. 👍 👍
Scorecard 👉 https://t.co/C7ggEOTWOe pic.twitter.com/OnWLKEBiov
— BCCI (@BCCI) August 1, 2022
Rohit Sharma took a mighty gamble by giving Avesh Khan the final over instead of Bhuvi and he paid the price.
Avesh bowled a no-ball, conceded a six and failed to defend 10 runs in the end. West Indies level the series 1-1. 🌴
Devon Thomas – 31* (19). 🔥 pic.twitter.com/3GsuL0Zdxd
— Saif Ahmed (@saifahmed75) August 1, 2022