ఇంగ్లండ్ టెస్టు జట్టు కెప్టెన్, స్టార్ ఆల్ రౌండర్ బెన్స్టోక్స్ ఇటివల వన్డే ఫార్మాట్కు వీడ్కోలు పలికి అందర్ని షాక్కు గురిచేశాడు. టీమిండియాతో ఇటివల మూడు వన్డేల సిరీస్ ముగిసిన మరుసటి రోజే సంచలన నిర్ణయం ప్రకటించాడు. మంగళవారం సౌతాఫ్రికాతో జరిగిన వన్డేతో బెన్స్టోక్స్ తన చివరి వన్డే ఆడేశాడు. అయితే.. తాను వన్డే ఫార్మాట్ నుంచి తప్పుకోవడానికి బిజీ షెడ్యూలే కారణమని.. మూడు ఫార్మాట్లలో ఆడేందుకు తన శరీరం సహకరించడం లేదని స్టోక్స్ సోమవారం ప్రకటించాడు.
మరుసటి రోజు తన రిటైర్మెంట్కు పరోక్షంగా ఇంగ్లండ్ క్రికెట్ బోర్డే కారణమంటూ స్టోక్స్ పేర్కొన్నాడు. ”పరిగెత్తడానికి మేము కార్లు కాదు.. నా వన్డే రిటైర్మెంట్తోనైనా మేల్కొంటే మంచిది” అంటూ ఈసీబీకి పరోక్షంగా చురకలంటించాడు. ‘ఆటగాళ్లకు కనీస విశ్రాంతి లేకుండా ఈబీసీ బిజీ షెడ్యూల్ ఉండేలా చేసింది. దీంతో ఆటగాళ్లు మానసిక ప్రశాంతతకు దూరమవుతున్నారు. నా విషయంలో ఇదే జరిగింది.
నిర్విరామంగా పరిగెత్తడానికి మేము కార్లు కాదు.. కార్లంటే పెట్రోల్ పోస్తే.. ఎంత స్పీడు పెంచితే అంత వేగంగా వెళ్తాయి. కానీ ఇక్కడ మేం మనుషులం. తీరిక లేకుండా క్రికెట్ ఆడితే ఎవరైనా అలసిపోతారు. ఆటగాళ్లకు రెస్ట్ కూడా అవసరం. విశ్రాంతి లేకుండా పరిగెత్తాలంటే ఎవరి తరం కాదు. నాకు 36 ఏళ్ల వయసు వచ్చిన తర్వాత నేను వెనుదిరిగి చూసుకుంటే గొప్ప ఇన్నింగ్స్లు కనబడాలే తప్ప ఉరుకులు పరుగులు కాదు. నా వన్డే రిటైర్మెంట్తోనైనా ఈసీబీ మేల్కొంటే మంచిది’ అంటూ పేర్కొన్నాడు.
కాగా స్టోక్స్ వ్యాఖ్యలపై ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ఇంకా ఎలాంటి స్పందన ఇవ్వలేదు. అయితే టీమిండియా ఆటగాళ్లు ఇలాంటి ఇబ్బంది పడకుండా బీసీసీఐ వర్క్లోడ్ మేనేజ్మెంట్ను అవలంభిస్తూ.. ఆటగాళ్లకు విశ్రాంతి ఇస్తుంది. మరి బెన్స్టోక్స్ వ్యక్తం చేసిన ఆవేదనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
❤️🏴 pic.twitter.com/xTS5oNfN2j
— Ben Stokes (@benstokes38) July 18, 2022