టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేందర్ సెహ్వాగ్ ఆటగాడిగా ఉన్న సమయంలో ఎలాంటి భయంకరమైన బ్యాటింగ్తో ప్రత్యర్థులపై విరుచుకుపడేవాడో ప్రత్యేకంగా వివరించి చెప్పాల్సిన పనిలేదు. అతను ఆడుతుంటే.. సింహం జూలువిదిల్చి వేటాడినట్టే ఉంటుంది. కొన్ని ఏళ్ల పాటు భారత క్రికెట్కు సేవలుందిస్తూ.. క్రికెట్ అభిమానులకు వినోదాన్ని పంచిన సెహ్వాగ్.. ఆట నుంచి రిటైర్ అయిన తర్వాత.. వ్యాఖ్యాతగా కూడా తన విభిన్న శైలిని కొనసాగిస్తున్నాడు. క్రికెట్ గురించి చాలా విషయాలపై తనదైన రీతిలో స్పందించే సెహ్వాగ్.. తాజాగా బంగ్లాదేశ్పై టీమిండియా టెస్టు సిరీస్ విజయం, అశ్విన్ అద్భుత బ్యాటింగ్పై స్పందించాడు. ఈ క్రమంలో అశ్విన్పై ప్రశంసలు కురిపిస్తూ.. అశ్విన్ను సైంటిస్ట్ అంటూ పేర్కొన్నాడు.
‘సైంటిస్ట్ పూర్తి చేశాడు. ఇది ఎలాగోలా వచ్చింది. శ్రేయస్ అయ్యర్తో మంచి భాగస్వామ్యం నెలకొల్పడమే కాకుండా.. అశ్విన్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు’ అంటూ సెహ్వాగ్ ట్వీట్ చేశాడు. అయితే.. ఇందులో అశ్విన్ను సైంటిస్ట్ అని పేర్కొనడం విశేషం. అందుకే సెహ్వాగ్ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సెహ్వాగ్ అలా ఎందుకు అన్నాడంటే.. 74 పరుగులకే టీమిండియా 7 వికెట్లు కోల్పోయి.. పీకల్లోతు కష్టాల్లో పడింది. ఛేదించాల్సింది.. 145 పరుగులే అయినా.. బంగ్లాదేశ్ బౌలర్లు అంచనాలకు మించి రాణిస్తుండటంతో భారత్కు విజయం దక్కడం బహు కష్టంగా అనిపించింది. కానీ.. క్రీజ్లో ప్రొఫెషనల్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ ఉన్నాడన్న ఒక్క ధైర్యం తప్పా.. భారత క్రికెట్ అభిమానులకు మ్యాచ్పై పెద్దగా ఆశలు లేవు.
పైగా శ్రేయస్ అయ్యర్ మంచి ఫామ్లో ఉండి.. నిలకడగా రాణిస్తూ.. పరుగులు చేస్తుండటంతో అతనిపైనే అంతా నమ్మకం పెట్టుకున్నారు. కానీ.. అతనితో పాటు క్రీజ్లో ఉన్న మాస్టర్ మైండ్ అశ్విన్పై మాత్రం మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడతాడనే నమ్మకం ఎవరికీ లేదు. అశ్విన్ బ్యాటింగ్ చేయగలడనే విషయం అందరికి తెలిసినా.. మ్యాచ్ను గెలిపించేంత సీన్ ఉందా అనే అనుమానం. అయితే.. ఫామ్లో ఉన్న శ్రేయస్ అయ్యర్ను వెనక్కి నెడుతూ.. అప్పటి వరకు నిప్పులు చెరిగిన బంగ్లా బౌలర్ల తుప్పు రేగ్గొడుతూ.. 62 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్స్తో 42 పరుగులు చేసి ఒంటి చేత్తో మ్యాచ్ గెలిపించాడు. ఈ ఇన్నింగ్స్లో 42 రన్స్తో అశ్విన్ టాప్ స్కోరర్గా నిలవడమే కాకుండా.. అయ్యర్తో అద్భుతమైన 71 పరుగుల పార్టనర్షిప్ నెలకొల్పాడు.
అవసరమైన సమయంలో ఎలా ఆడాలో, పార్ట్నర్షిప్ను ఎలా నెలకొల్పాలో, ప్రత్యర్థిపై ఎప్పుడు దాడి చేయాలో.. అంతా ఒక ప్లానింగ్ ప్రకారం చేశాడు కనుకే.. టీమిండియాకు ఈ విజయం దక్కింది. అందుకే.. సెహ్వాగ్ అశ్విన్ను సైంటిస్ట్తో పోల్చాడు. నిజంగానే అశ్విన్ ఒక సైంటిస్ట్.. మ్యాచ్లో విజయం ఎలా సాధించాలో అతనికి బాగా తెలుసు. టీ20 వరల్డ్ కప్లో పాక్తో మ్యాచ్లో చివరి బంతికి రెండు పరుగులు అవసరమైన సమయంలో వైడ్బాల్ను అనవసరంగా కొట్టకుండా.. వైడ్ పోనిచ్చి.. మ్యాచ్ను డ్రా చేసి.. తర్వాతి బాల్కు సింగిల్ తీసి.. అద్భుత విజయాన్ని అందించాడు. ఆ మ్యాచ్లో కోహ్లీ విశ్వరూపం చూపించినా.. అశ్విన్ మాస్టర్ మైండ్ కూడా విజయానికి ఎంతో దోహదం చేసిన విషయం తెలిసిందే. అందుకే.. బాల్ను వదిలేసి కూడా మ్యాచ్ను గెలుస్తాడు.. బాల్ను బాది కూడా మ్యాచ్ గెలుస్తాడు. అందుకే అశ్విన్ ఒక మాస్టర్మైండ్.
The scientist did it. Somehow got this one. Brilliant innings from Ashwin and wonderful partnership with Shreyas Iyer. pic.twitter.com/TGBn29M7Cg
— Virender Sehwag (@virendersehwag) December 25, 2022