ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టీ20 వరల్డ్ కప్ 2022లో టీమిండియా వైఫల్యంపై బీసీసీఐ దిద్దుబాటు చర్చలు దిగింది. చేతన్ శర్మ చీఫ్గా ఉన్న సెలెక్షన్ కమిటీ మొత్తాన్ని తొలగించి వారిపై వేటు వేసింది. వరల్డ్ కప్లో సెమీస్ వరకు చేరిన టీమిండియా.. సెమీస్లో ఇంగ్లండ్ చేతిలో దారుణంగా ఓడిన విషయం తెలిసిందే. అయితే.. వరల్డ్ కప్కు ముందు అదే పనిగా కెప్టెన్లను మార్చడం.. ఏ మాత్రం ప్రణాళిక లేకుండా జట్టును ఎంపిక చేయడంపై కొత్తగా ఎన్నికైన బీసీసీఐ కమిటీ సీరియస్గా ఉన్నట్లు అందుకే.. ఒకే సారి సెలెక్షన్ కమిటీ మొత్తానికి తొలగించింది. బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తర్వాత బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన రోజర్ బిన్నీ ఇండియన్ క్రికెట్లో భారీ మార్పులు చేపట్టేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే తొలుత సెలెక్షన్ కమిటీపై వేటు చేసినట్లు సమాచారం.
ఇప్పుడు తొలగించిన సెలెక్షన్ కమిటీ స్థానంలో కొత్త సెలెక్టర్ల కోసం అప్పడే బీసీసీఐ నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. ఐదు స్థానాలకు దరఖాస్తు చేసుకోవాల్సిందా బీసీసీఐ పేర్కొంది. ఈ విషయం పక్కన పెడితే.. చేతన శర్మ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీని బాధ్యతల నుంచి తప్పించడంపై టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. కర్మ సిద్ధాంతం అందరికి సరైన సమాధానం ఇస్తుందని సోషల్ మీడియాలో తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే.. తొలుత సౌరవ్ గంగూలీకి కర్మ తన పవర్ ఏంటో చూపిస్తే.. ఇప్పుడు చేతన్ శర్మ అండ్ కోకు కర్మ అంటే ఏంటో తెలిసోచ్చిందని అంటున్నారు.
అందుకు కారణం.. 2021లో జరిగిన టీ20 వరల్డ్ కప్లో టీమిండియా గ్రూప్ స్టేజ్లోనే ఇంటిదారి పట్టింది. అంతకంటే ముందే వరల్డ్ కప్ తర్వాత టీ20 కెప్టెన్సీని వదిలేసుకుంటున్నట్లు కోహ్లీ ప్రకటించాడు. ఆ తర్వాత కోహ్లీని వన్డే కెప్టెన్గా తొలగించారు. టీ20 కెప్టెన్గా తప్పుకుని వన్డే, టెస్టుల్లో టీమిండియాను విజయవంతంగా నడపాలని ఆశపడ్డ కోహ్లీపై వేటు వేస్తూ.. వన్డే కెప్టెన్గా తప్పించారు. ఆ తర్వాత కోహ్లీ టెస్టు కెప్టెన్సీని సైతం వదిలేసి.. కేవలం ఒక ఆటగాడిగా జట్టులో కొనసాగుతున్నాడు. అయినా కూడా కోహ్లీ ఇప్పుడు టాప్ ప్లేయర్గానే ఉన్నాడు. అయితే.. కోహ్లీని వన్డే కెప్టెన్గా తొలగించి అవమానించిన.. బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ బోర్డు నుంచి వెళ్లిపోయిన కొద్ది రోజులకే సెలెక్షన్ కమిటీ సైతం సర్దుకోవడంతో.. కోహ్లీకి చేసిన ద్రోహమే కర్మ రూపంలో ఇద్దరిని వెంటాడిందని ఫ్యాన్స్ అంటున్నారు. కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తర్వాత కోహ్లీకి-బోర్డు మధ్యలో కోల్డ్వార్ సైతం నడిచిన విషయం తెలిసిందే. నిన్న గంగూలీ, నేడు చేతన్ అండ్ కో, రేపు రోహిత్ శర్మ.. అంటూ కోహ్లీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పేర్కొంటున్నారు. అంటే త్వరలోనే రోహిత్ తన టీ20 కెప్టెన్సీ కోల్పోతాడని వారి అభిప్రాయం.
Ganguly gone ✅
Chetan Sharma gone ✅
Form came back ✅pic.twitter.com/7124Q8J6L3— Jahazi (@Oye_Jahazi) November 18, 2022
#ChetanSharma pic.twitter.com/TEPONXVhIR
— Glen Maxi (@Glenmaxi9) November 19, 2022
Earlier ganguly and now Chetan Sharma is sacked , it hurts so bad 💔.
But I prayed for days like this won’t lie pic.twitter.com/WX1VyPA2rC— Yashvi (@BreatheKohli) November 18, 2022