ఐపీఎల్ 2022లో సన్రైజర్స్ హైదరాబాద్ తరపున ఆడుతున్న నికోలస్ పూరన్ నైట్ రైడర్స్ తరపున బరిలోకి దిగనున్నాడు. కానీ.. ఐపీఎల్లోని కోల్కత్తా నైట్ రైడర్స్ తరపున కాదు.. సీపీఎల్లోని ట్రిన్బాగో నైట్ రైడర్స్ తరపున. ఆగస్టులో ప్రారంభం కానున్న ఈ లీగ్ కోసం ట్రిన్బాగో నైట్ రైడర్స్ నికోలస్ పూరన్తో పాటు ఆండ్రూ రస్సెల్ను తమ జట్టులోకి తీసుకుంది. ప్రస్తుతం రిటేన్షన్ ప్రక్రియ నడుస్తుండగా.. ప్రతి జట్టు ఐదుగురు కరేబియన్ ప్లేయర్లతో పాటు ఇద్దరు స్థానిక యువ క్రికెటర్లను రిటేన్ లేదా పిక్ చేసుకునే అవకాశం ఉంది.
కీరన్ పొలార్డ్ కెప్టెన్గా ఉన్న టీకేఆర్లోకి రస్సెల్, పూరన్ కొత్తగా వచ్చి చేరారు. ఆ జట్టులో సునీల్ నరైన్ కూడా ఉన్నాడు. ఐపీఎల్లో కోల్కత్తా నైట్ రైడర్స్, కరేబియన్ లీగ్లోని ట్రిన్బాగో నైట్రైడర్స్ ఓనర్ ఒక్కరే. బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ ఈ రెండు టీమ్స్కు సహా యజమానిగా ఉన్నాడు. ఐపీఎల్ ముగిసిన తర్వాత.. ఆగస్టులో కరేబియర్ ప్రీమియర్ లీగ్ ప్రారంభం కానుంది. ప్రస్తుతం పూరన్ ఫామ్లో లేకున్నా.. ట్రిన్బాగో నైట్ రైడర్స్ అతన్ని తీసుకోవడం విశేషం. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: 8 సిక్సులతో విధ్వంసం సృష్టించిన రస్సెల్! తిట్టిన అంపైర్
We are ready for yet another title charge🏆#TKRFamily 🇹🇹 put your hands up for our retained Knights:@KieronPollard55 , Sunil Narine, @AHosein21 , Jayden Seales, @WebsterTion and the two new Caribbean stars joining us @Russell12A @nicholas_47 pic.twitter.com/mzcH5yugMJ
— Trinbago Knight Riders (@TKRiders) April 4, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.