ఎన్నో ఏళ్ల నుంచి క్రీడా అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న 32వ ఒలంపిక్స్ క్రీడలు ఎట్టకేలకు ప్రారంభమయ్యాయి. 2020లోనే ప్రారంభమవ్వాల్సిన ఈ క్రీడలు కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. ఇక ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య క్రమ క్రమంగా తగ్గుతుండటంతో ఈ వేడుకలు ప్రారంభించారు. ఈ సారి ఒలంపిక్స్ క్రీడలను జపాన్ ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఇందులో అన్ని దేశాల నుంచి, అన్ని రకాల అథ్లెట్లు టోక్యో ఒలంపిక్స్ పాల్గొంటున్నారు.
జపాన్ చక్రవర్తి నరుహిటో, అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ అధ్యక్షుడు థామస్ బాక్ లాంఛనంగా ఈ విశ్వక్రీడోత్సవాన్ని ప్రారంభించారు. లేజర్ తళుకులు, మెరుపులు, మధ్య, కళాకారుల విన్యాసాల నడుమ క్రీడలు షురూ అయ్యాయి. తొలుత గ్రీస్ అథ్లెట్లు తమ జాతీయ పతాకం చేతబూని మార్చ్ చేశారు. ఈ వేడుకకు ప్రపంచదేశాల నుంచి 20 మంది విశిష్ట అతిధులు హాజరయ్యారు. ఇక ఇందులో 153 దేశాలు ఒలంపిక్ క్రీడల్లో పాల్గొన్నాయి.
కాగా 339 ఈ వెంట్స్, 33 ఆటలకు పోటీలు జరగనున్నాయి. ఇక ఈ సారి కొత్తగా 5 ఆటలను ఇందులో పరిచయం చేస్తుండటం విశేషం. ఇక భారత్ నుంచి ఈ సారి 20 మంది క్రీడాకారులు మాత్రమే పాల్గొంటున్నారు. ఇక కరోనా నేపథ్యంలో వేడుకులను అట్టహాసంగా నిర్వహించడం లేదనే చెప్పాలి. ఇక ఈ వేడుకల్లో పాల్గొనే అథ్లెట్లు పట్ల ప్రత్యేక శ్రద్ద చూపిస్తోంది జపాన్ ప్రభుత్వం. ఇక తాజాగా ఒలంపిక్స్ లో కొన్ని కరోనా కేసులు కూడా నమోదవ్వటం విశేషం.