‘బిగ్ బి అమితాబచ్చన్’ హోస్ట్గా అత్యంత సక్సెస్ఫుల్గా నడుస్తున్న టీవీ షో ‘కౌన్ బనేగా కరోడ్పతి’. ఈ కార్యక్రమం 12 సీజన్లు పూర్తి చేసుకుని 13వ సీజన్ కొనసాగుతోంది. ఈ షో లేటెస్ట్ ఎపిసోడ్లో రెండు ఆసక్తికర అంశాలు చోటుచేసుకున్నాయి. కంటెస్టెంట్లుగా భారత మాజీ దిగ్గజ క్రికెటర్లు సౌరవ్ గంగూలీ, వీరేంద్ర సెహ్వాగ్ పాల్గొన్నారు. రెండు తెలంగాణ మంత్రి కేటీఆర్ ఈ షోలో భాగమయ్యారు. అంటే నేరుగా పాల్గొన్నారు అనుకుంటే మీరు పొరబడినట్లే. కేటీఆర్ ట్వీట్ని ఒక ప్రశ్నగా ఈ షోలో వాడారు.
ఎప్పుడూ ప్రశ్నలడిగే బిగ్ బీనే హాట్ సీట్లో కూర్చోబెట్టాడు గంగూలీ. ‘మీరు ఇలానే యాంకరింగ్ చేస్తూ పోతే నా సీటుకే ఎసరుపెడతారేమో’ అంటూ అమితాబ్ బచ్చన్ చమత్కరించారు. కొవిడ్ విజృభిస్తున్న సమయంలో ట్విట్టర్ వేదికగా కేటీఆర్ సరదాగా ఓ ట్వీట్ చేశారు. ఈ మందులను పలకడం కూడా మన వల్ల కాదేమో అంటూ కొన్ని ఔషదాల పేర్లను ట్వీట్ చేశారు కేటీఆర్. ఆ ట్వీట్కి ఎవరిని ట్యాగ్ చేశారంటూ గంగూలీ, సెహ్వాగ్ని అడిగారు. వారికిచ్చిన ఆప్షన్స్లో కపిల్ సిబల్, సుబ్రమణ్య స్వామి, అమితావ్ ఘోష్, శశి థరూర్ పేర్లు ఉన్నాయి. వారు ఏమాత్రం ఆలోచింతకుండా శశి థరూర్ పేరును చెప్పి 40 వేల రూపాయలు గెలుచుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న కేటీఆర్ ‘సరదాగా చేసిన ట్వీట్ ఇలా కేబీసీ దాకా వెళ్తుందనుకోలేదు.. సంతోషంగా ఉంది’ అంటూ ట్వీట్ చేశారు.
Ain’t this hilarious @ShashiTharoor !
Just a tongue-in-cheek comment apparently made it to KBC 😁
Hope Dada and Sehwag got it right https://t.co/y6VsC9lFEg
— KTR (@KTRTRS) September 3, 2021
షో మొత్తంలో దాదా, సెహ్వాగ్ చేసిన సందడి అంతా ఇంతా కాదు. సౌరవ్ గంగూలీ, వీరేంద్ర సెహ్వాగ్ చేసిన సందడి అంతా ఇంతా కాదు. 2002లో పాకిస్తాన్పై జరిగిన మ్యాచ్లో ఓ సందర్భాన్ని ప్రస్తావించాడు గంగూలీ. ‘325 పరుగుల లక్ష్యాన్ని ఛేదించాలి. నేను, సెహ్వాగ్ ఓపెనింగ్కి దిగాం.. మాపై ఒత్తిడి ఉంది. మొదటి పవర్ ప్లేలో జాగ్రత్తగా రొటేట్ చేద్దాం అని చెప్పాను. ఫస్ట్ బాల్ మిడాన్ మీదుగా బౌండ్రీ బాదాడు. మొదటి ఓవర్లో 5 ఫోర్లు కొట్టాడు’ అంటూ గంగూలీ ప్రస్తావించాడు. ‘మాకు గంగూలీ డబ్ల్యూహెచ్వో లాంటి వాడు ఏం చెప్తే అది కళ్లు మూసుకుని చేసేస్తాం’ అన్నాడు. ‘అవును ఇప్పుడే చెప్పాకదా నా మాట ఎంత బాగా వింటారో’ అంటూ గంగూలీ చమత్కరించాడు. ఈ ఎపిసోడ్లో గంగూలీ, సెహ్వాగ్ మొత్తం 25 లక్షల రూపాయలు గెలుచుకున్నారు. గెలిచిన మొత్తాన్ని వారి సంస్థల ద్వారా సేవా కార్యక్రమాలకు వినియోగిస్తామని చెప్పారు.
Rs.40000 worth question 👇🏾 pic.twitter.com/GlT0T5UjNz
— krishanKTRS (@krishanKTRS) September 3, 2021