టీ20 వరల్డ్ కప్ 2022లో భాగంగా బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో ‘విరాట్ కోహ్లీ ఫేక్ ఫీల్డింగ్’ వివాదం మరింత ముదురుతోంది. ఈ మ్యాచ్లో తమ ఓటమికి కోహ్లీ ఫేక్ ఫీల్డింగే కారణమని బంగ్లాదేశ్ క్రికెటర్ నూరుల్ హసన్ ఆరోపించి.. ఈ వివాదానికి తెరతీశాడు. బంగ్లాదేశ్ బ్యాటింగ్ సమయంలో అక్షర్ పటేట్ వేసిన ఇన్నింగ్స్ ఏడో ఓవర్లో లిటన్ దాస్ డీప్ ఆఫ్సైడ్ వైపు షాట్ ఆడాడు. అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న అర్షదీప్ సింగ్ బంతిని అందుకుని కీపర్ దినేష్ కార్తీక్కు విసిరాడు. ఆ బంతి.. పాయింట్లో ఫీల్డింగ్ చేస్తున్న విరాట్ కోహ్లీ పక్కగా కీపర్కు వెళ్లింది. కానీ.. తన దగ్గరగా బాల్ రాగానే.. దాన్ని అందుకుని నాన్స్ట్రైకర్ వైపు త్రో వేస్తున్నట్లు కోహ్లీ యాక్షన్ చేశాడు.
తమ బ్యాటర్ను కన్ఫ్యూజ్ చేయడానికే కోహ్లీ ఫేక్ ఫీల్డింగ్ చేశాడని.. ఈ విషయం అంపైర్లు గుర్తించలేదని, వాళ్లు గుర్తించి ఉంటే తమకు 5 పెనాల్టీ రన్స్ వచ్చేవని నూరుల్ వాపోయాడు. అయితే.. ఈ విషయంలో అంపైర్ల తప్పిదం ఉందని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు భావిస్తోంది. ఈ విషయం గురించి ఫీల్డ్ అంపైర్లపై ఐసీసీకి ఫిర్యాదు చేస్తామని కూడా బీసీబీ పేర్కొంది. అయితే.. విరాట్ కోహ్లీ ఫేక్ ఫీల్డింగ్పై బంగ్లాదేశ్ క్రికెట్ అభిమానులతో పాటు పాక్ ఫ్యాన్స్ కూడా అతి చేస్తున్నారు. టీమిండియా చీటింగ్ చేసి గెలిచిందంటూ ట్విట్టర్లో రచ్చ రచ్చ చేస్తున్నారు. విరాట్ కోహ్లీ నో బాల్ అంటే నో బాల్.. వైడ్ అంటే వైడ్ ఇచ్చే అంపైర్లు.. కోహ్లీ ఫేక్ ఫీల్డింగ్ను కావాలనే గుర్తించలేదని ఆరోపిస్తున్నారు.
తాజాగా ఈ ఘటన టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా సైతం స్పందిస్తూ.. విరాట్ కోహ్లీ వందకు వంద శాతం ఫేక్ ఫీల్డింగ్కు పాల్పడ్డడానికి సంచలన సేట్మెంట్ ఇచ్చాడు. ‘బంగ్లాదేశ్తో మ్యాచ్ విరాట్ కోహ్లీ చేసింది ఫేక్ ఫేల్డింగ్. అది వందశాతం ఫేక్ ఫీల్డింగ్. అంపైర్లు గుర్తించి ఉంటే.. మనకు ఐదు పరుగుల పెనాల్టీ పడేది. బంగ్లాదేశ్కు ఐదు పరుగులు యాద్ అయ్యేవి. అలాగే బంగ్లా ఈ మ్యాచ్లో ఐదు పరుగులతో ఓడింది. ఈ పెనాల్టీ రన్స్ యాడ్ అయి ఉంటే ఫలితం వేరేలా ఉండేది.’ అని చోప్రా పేర్కొన్నాడు. కాగా.. చోప్రా కామెంట్స్ను ఇండియన్ క్రికెట్ అభిమానులు తప్పుబడుతున్నాడు. బాల్ తనదగ్గర లేదనే విషయం బ్యాటర్లకు స్పష్టం తెలుసని.. కోహ్లీ చేసిన యాక్షన్పై బ్యాటర్ల దృష్టి ఏ మాత్రం లేదని.. అలాంటప్పుడు అది ఫేక్ ఫీల్డింగ్ ఎలా అవుతుందని ఫ్యాన్స్ అంటున్నారు.