టీ20 వరల్డ్ కప్లో టీమిండియా మూడో విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. బుధవారం అడిలైడ్ ఓవల్లో బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో భారత్ 5 పరుగుల తేడాతో గెలుపొందించింది. ఈ విజయంతో టీమిండియా సెమీస్ అవకాశాలు మరింత మెరుగైయ్యాయి. అయితే.. ఈ మ్యాచ్లో 62 పరుగులతో టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించి.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా ఎంపికైన విరాట్ కోహ్లీ మ్యాచ్లో ఫేక్ ఫీల్డింగ్ చేశాడనే ఆరోపణలు వస్తున్నాయి. ఉద్దేశ పూర్వకంగా కోహ్లీ ఫేక్ ఫీల్డింగ్ చేశాడని.. ఆ విషయాన్ని అంపైర్లు గుర్తించలేదని, వారు గుర్తించి ఉంటే బంగ్లాదేశ్కు 5 పెనాల్టీ రన్స్ వచ్చేవని.. దీంతో బంగ్లాదేశ్ ఈ మ్యాచ్ గెలిచి ఉండేదని ఆ జట్టు ఆటగాడు నూరుల్ హసన్ ఆరోపించాడు. ప్రస్తుతం కోహ్లీ ఫేక్ ఫీల్డింగ్పై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతోంది.
ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 184 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ హాఫ్ సెంచరీతో రాణించగా.. విరాట్ కోహ్లీ తన ఫామ్ను కొనసాగిస్తూ.. 62 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. ఇక సూర్యకుమార్ యాదవ్ కూడా 30 పరుగులతో రాణించాడు. ఇక లక్ష్యఛేదనకు దిగిన బంగ్లాదేశ్కు ఆ జట్టు ఓపెనర్ లిట్టన్ దాస్ మెరుపు ఆరంభాన్ని అందించాడు. 27 బంతుల్లో 60 పరుగులతో టీమిండియా బౌలర్లను ఓ ఆట ఆడుకున్నాడు. ఈ క్రమంలోనే ఇన్నింగ్స్ 7వ ఓవర్లో అర్షదీప్ బౌలింగ్లో దాస్.. డీప్ ఆఫ్సైడ్ వైపు షాట్ ఆడాడు. అయితే అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న అర్షదీప్ సింగ్ బంతిని కీపర్ దినేష్ కార్తీక్కు విసిరాడు.
ఆ బాల్ పాయింట్లో ఫీల్డింగ్ చేస్తున్న విరాట్ కోహ్లీ పక్కగా వెళ్లింది. కానీ.. కోహ్లీ మాత్రం ఆ బాల్ను అందుకుని వికెట్లకు త్రో వేసినట్లు యాక్షన్ చేశాడు. ఈ విషయాన్ని అంపైర్లు గానీ, బంగ్లా బ్యాటర్లు గానీ గమనించలేదు. ఒక వేళ వారు గమనించి ఉంటే.. ఫేక్ ఫీల్డింగ్ కారణంగా క్రికెట్ నిబంధన 41.5 ప్రకారం బంగ్లాకు 5 పరుగులు పెనాల్టీ రూపంలో వచ్చేవి. పైగా.. ఆ బాల్ను డాట్ బాల్గా ప్రకటించే వారు. దీంతో బంగ్లా ఈ మ్యాచ్లో విజయం సాధించి ఉంటేంది. ఎందుకంటే ఈ మ్యాచ్లో బంగ్లాదేశ్ 5 పరుగుల తేడాతోనే ఓడింది. ఈ విషయాన్నే ఇప్పుడు బంగ్లా ఆటగాడు నూరుల్ ఆరోపిస్తున్నాడు. విరాట్ కోహ్లీ ఫేక్ ఫీల్డింగ్కు పాల్పడ్డడాని అంటున్నాడు. అయితే.. అర్షదీప్ సింగ్ విసిరిన త్రోను ఇమిటేట్ చేస్తూ.. కోహ్లీ సరదాగా చేశాడని, గతంలో కూడా బౌండరీ వద్ద నుంచి ఫీల్డర్ అందించిన బంతిని వేగంగా అందుకుని రనౌట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అది గుర్తుకు వచ్చి కోహ్లీ ఇలా చేసి ఉంటాడని ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ కోహ్లీని వెనకేసుకొస్తున్నారు.
Fake fielding. 5 run penalty. Missed by umpires. Of course. https://t.co/KgRBHz9jv3
— Dennis Fake Fielding (@DennisCricket_) November 2, 2022