వరల్డ్ కప్లో టీమిండియా తొలి ఎదురుదెబ్బ తగిలింది. ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ 2022లో భాగంగా ఆదివారం పెర్త్లో సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో భారత్ 5 పరుగులతో చిత్తయింది. ఈ మ్యాచ్లో టీమిండియా అన్ని విభాగాల్లో విఫలమైందనే చెప్పాలి. బ్యాటింగ్, బౌలింగ్ ముఖ్యంగా ఫీల్డింగ్లో అత్యంత చెత్త ప్రదర్శన కనబర్చింది. సౌతాఫ్రికాపై గెలిస్తే.. నేరుగా సెమీస్కు క్వాలిఫై అయ్యే అవకాశం ఉన్నా కూడా ఆ స్థాయి ప్రదర్శనను ఇవ్వలేదు. సౌతాఫ్రికాపై ఓటమికి రోహిత్ శర్మ చెత్త కెప్టెన్సీ కూడా ఒక ప్రధాన కారణమనే విమర్శలు వస్తున్నాయి. బ్యాటింగ్లో విఫలమవుతున్న రోహిత్.. కెప్టెన్గానూ ఘోర తప్పిదాలు చేస్తున్నాడు. గ్రూప్ దశలో ఒక ఓటమి సరే కానీ.. నాకౌట్ మ్యాచ్ల్లో కెప్టెన్గా ఇలాంటి తప్పులు చేస్తే.. భారత కప్ గెలవడం కష్టమే అంటూ క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఇదో చెత్త ప్లేయింగ్ ఎలెవన్..!
వరల్డ్ కప్ వేటను చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్తో ఆరంభించిన టీమిండియా విరాట్ కోహ్లీ వీరోచిత పోరాటంతో ఆ మ్యాచ్ గెలిచింది. అదే టీమ్తో నెదర్లాండ్స్పై విజయం సాధించింది. కానీ.. సౌతాఫ్రికాతో మాత్రం రోహిత్ శర్మ జట్టులో ఒక మార్పుతో బరిలోకి దిగాడు. ఆల్రౌండర్ అక్షర్ పటేల్ స్థానంలో దీపక్ హుడాని తుది జట్టులోకి తీసుకున్నాడు. హుడాను ఎందుకు జట్టులోకి తీసుకున్నాడో ఎవరీ అర్థం కాలేదు. పిచ్ పేసర్లకు అనుకూలంగా ఉందని భావిస్తే.. హుడాతో బౌలింగ్ చేయించలేదు. బ్యాటింగ్లో అతను డకౌట్ అయ్యాడు. ఏమాత్రం ఫామ్లో లేని హుడాను జట్టులోకి తీసుకున్న రోహిత్ పెద్ద తప్పు చేశాడు. హుడా స్థానంలో మరో పేసర్ హర్షల్ పటేల్ను తీసుకున్నా.. నాలుగురు పేసర్లతో బరిలోకి దిగినట్లు ఉండేది.
ఇక అశ్విన్ స్థానంలో యుజ్వేంద్ర చాహల్ను తీసుకోకుండా రోహిత్ మరో తప్పు చేశాడు. సౌతాఫ్రికా బ్యాటర్ల ముందు అశ్విన్ బౌలింగ్ తేలిపోయింది. చాహల్ జట్టులో ఉంటే ఫ్లైయిటెడ్ డెలివర్సీతో ప్రొటీస్ బ్యాటర్లను కచ్చితంగా ఇబ్బంది పెట్టి.. వికెట్లు అందించేవాడు. ఇక రవిచంద్రన్ అశ్విన్తో 18వ ఓవర్ వేయించడం రోహిత్ చేసి మరో పెద్ద తప్పు. ఆ ఓవర్లో అశ్విన్ భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. 18 బంతుల్లో 25 పరుగులు కావాల్సిన దశలో పేసర్తో బౌలింగ్ వేయించి కొత్త బ్యాటర్ మరింత ఇబ్బంది పెట్టడం.. మిల్లర్ను అవుట్ చేయడం జరిగి ఉంటే.. ఫలితం కచ్చితంగా వేరేలా ఉండేది. కానీ.. కొత్త బ్యాటర్ క్రీజ్లో ఉన్నాడనే ఉద్దేశంతో అశ్విన్తో 18వ రోవర్ వేయించానని, అయినా చివరి ఓవర్ స్పిన్నర్ వేస్తే ఎలాంటి ఫలితం ఉంటుందో గత మ్యాచ్ల్లో చూశానని రోహిత్ పేర్కొన్నాడు.
అలాగే జట్టు బ్యాటింగ్ లైనప్లో ఒక్క లెఫ్టా హ్యాండ్ బ్యాటర్ కూడా లేకపోవడంతో సౌతాఫ్రికా బౌలర్లు ఒకే లైన్ అండ్ లెంగ్త్తో బౌలింగ్ వేశారు. పంత్ జట్టులో ఉండి ఉంటే.. కనీసం లెఫ్ట్ రైట్ కాంబినేషన్తో ప్రొటీస్ బౌలర్లు లైన్ అండ్ లెంగ్త్ అయినా మార్చుకునే క్రమంలో లయతప్పేవారు. పైగా దినేష్ కార్తీక్ కూడా అంతగా ఫామ్లో లేడు. ఇక అన్నింటికి తోడు.. ఫీల్డింగ్ వైఫల్యాలు. కెప్టెన్గా మంచి ఫీల్డింగ్తో జట్టులో స్ఫూర్తి నింపాల్సిన రోహిత్ రెండు సులువైన రనౌట్లు మిస్ చేసి.. మార్కరమ్, మిల్లర్లకు లైఫ్లు ఇచ్చాడు. ఇక కోహ్లీ కూడా మార్కరమ్ ఇచ్చిన ఒక సింపుల్ క్యాచ్ను అందుకోవడంలో విఫలం అయ్యాడు. సౌతాఫ్రికా లాంటి పటిష్టమైన జట్టుతో మ్యాచ్కు రోహిత్ సరైన టీమ్తో బరిలోకి దిగడంలో కెప్టెన్గా విఫలం అయ్యాడని క్రికెట్ అభిమానులు సైతం భావిస్తున్నారు.
#TeamIndia fought hard but it was South Africa who won the match.
We will look to bounce back in our next game of the #T20WorldCup . 👍 👍
Scorecard ▶️ https://t.co/KBtNIk6J16 #INDvSA pic.twitter.com/Q6NGoZokuE
— BCCI (@BCCI) October 30, 2022