టీమిండియా మాజీ కెప్టెన్, ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీకి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. సోమవారం రాత్రి ఆయనకు ఆర్టీపీసీఆర్ పరీక్ష నిర్వహించగా.. అందులో కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. వెంటనే ఆయనను కోల్కత్తాలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం దాదాకు కరోనా చికిత్స అందిస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు.
కాగా ఈ ఏడాది జనవరిలో దాదాకు గుండెపోటు వచ్చిన విషయం తెలిసిందే. మరి ఇప్పుడు కరోనా బారిన పడ్డంతో ఆయన కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. దాదాకు కరోనా సోకడంతో.. పలువురు క్రికెటర్లు, ప్రముఖులు ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీస్తున్నట్లు సమాచారం. దాదాకు కరోనా సోకడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.