ఒత్తిడిని తట్టుకుంటూ ఆ ఇద్దరూ టీమిండియాను గెలిపించారంటూ.. బంగ్లాదేశ్ టెస్ట్ టీమ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్.. రవిచంద్రన్ అశ్విన్, శ్రేయస్ అయ్యర్లపై ప్రశంసల వర్షం కురిపించాడు. కేవలం 145 పరుగుల లక్ష్యం ఛేదించేందుకు బరిలోకి దిగిన టీమిండియాను బంగ్లాదేశ్ బౌలర్లు ఇబ్బంది పెట్టారు. పుజారా, విరాట్ కోహ్లీ, రిషభ్ పంత్ లాంటి బ్యాటర్లు సైతం బంగ్లాదేశ్ బౌలర్ల ముందు నిలువలేకపోయాడు. దీంతో.. టీమిండియా కేవలం 74 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. బంగ్లాదేశ్ బౌలర్లు చెలరేగుతుంటే.. అశ్విన్, శ్రేయస్ అయ్యర్ ఎంతో పరిణతి చూపించి ఆడి.. మ్యాచ్ను బంగ్లాదేశ్ నుంచి లాక్కున్నారు. భారత్ ఈజీగా గెలుస్తుందనుకున్న మ్యాచ్.. బంగ్లాదేశ్ బౌలర్ల పోరాటంతో కాస్త కఠినంగా మారింది.
ఈ విజయంతో టీమిండియా రెండు టెస్టుల సిరీస్ను 2-0తో క్లీన్స్వీప్ చేసి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ రేసులో రెండో స్థానంలో నిలిచింది. ఇక రెండో టెస్టు ముగిసిన తర్వాత బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ మాట్లాడుతూ..‘రవిచంద్రన్ అశ్విన్, శ్రేయస్ అయ్యర్ వల్లే మేము ఈ మ్యాచ్లో ఓడిపోయాం.. వారిద్దరిలో ఒకరి వికెట్ తీసినా.. లేక మేము బ్యాటింగ్ చేసే సమయంలో మరో 70 పరుగులు అదనంగా చేసి ఉన్నా ఈ మ్యాచ్లో కచ్చితంగా గెలిచేవాళ్లం. గెలవాల్సిన మ్యాచ్లో ఓడినందుకు చాలా బాధగా ఉన్నా.. ఈ సిరీస్లో మా టీమ్ పోరాటం చూస్తే.. ఎంతో గర్వంగా ఉంది. జట్టులోని ప్రతి ఆటగాడు విజయం కోసం ఎంతో శ్రమించారు. అయితే.. ఈ మ్యాచ్తో టెస్టు క్రికెట్ మజాను క్రికెట్ అభిమానులు ఎంతో ఆస్వాదించారు. గ్యాలరీలో ఫ్యాన్స్ కూడా మంచి వినోదాన్ని పొందారు. ఇక ఈ మ్యాచ్లో మేము ఓడినా.. పటిష్టమైన టీమిండియాను మాత్రం వణికించాం’ అని షకీబ్ పేర్కొన్నాడు.
ఇక ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్.. 227 పరుగులకు ఆలౌట్ అయింది. అశ్విన్ 4, ఉమేష్ యాదవ్ 4, ఉన్కదట్ 2 వికెట్లతో రాణించడంతో బంగ్లా తక్కువ స్కోర్కే పరిమితం అయింది. ఇక టీమిండియా తొలి ఇన్నింగ్స్లో 314 పరుగులు చేసింది. రిషభ్ పంత్ 93, శ్రేయస్ అయ్యర్ 87 పరుగులతో రాణించడంతో.. ఆ మాత్రం స్కోర్ అయినా వచ్చింది. రెండో ఇన్నింగ్స్లోనూ బంగ్లాదేశ్ను భారత బౌలర్లు తక్కువ స్కోర్కే కట్టడి చేశారు. 231 పరుగుల చేసి బంగ్లాదేశ్.. మొత్తం మీద టీమిండియా ఎదుట 145 పరుగుల స్వల్ప టార్గెట్ను ఉంచింది. ఈ టార్గెట్ను భారత్ ఈజీగా కొట్టేస్తుందని భావించగా.. బంగ్లాదేశ్ బౌలర్లు చెలరేగిపోవడం.. 74 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా సాగింది. కానీ.. అశ్విన్ 42, శ్రేయస్ అయ్యర్ 29 పరుగులు.. టీమిండియాను ఘోర పరాజయం నుంచి కాపాడి గెలిపించారు. మరి ఈ మ్యాచ్లో టీమిండియా విజయం, షకీబ్ కామెంట్స్పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Here’s how KL Rahul, Shreyas Iyer, Cheteshwar Pujara, and Shakib Al Hasan reacted to India’s remarkable win against Bangladesh in the second Test.#CricTracker #BANvIND #RaviAshwin pic.twitter.com/xgjwdh4dk3
— CricTracker (@Cricketracker) December 25, 2022