న్యూజిలాండ్ దిగ్గజ క్రికెటర్ రాస్ టేలర్ చాలా సుదీర్ఘమైన కెరీర్కు ఇటివల వీడ్కోలు పలికాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయిన టేలర్ తాజాగా టీమిండియా యువ క్రికెటర్లపై ప్రశంసల వర్షం కురిపించాడు. టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్, బ్యాట్స్మెన్ శ్రేయస్ అయ్యర్ భవిష్యత్తులో ఇండియన్ క్రికెట్లోనే కాదు.. ప్రపంచ క్రికెట్లోనే సూపర్స్టార్లుగా నిలుస్తారని టేలర్ అభిప్రాయపడ్డారు.
చాలా తక్కువ సమయాల్లో మాత్రమే స్పందించే టేలర్ ఇలా భారత యువ క్రికెటర్లపై ప్రశంసలు కురిపించడం విశేషం. టీమిండియా దిగ్గజ క్రికెటర్ మహేంద్రసింగ్ ధోని తర్వాత టీమిండియా రెగ్యులర్ వికెట్ కీపర్గా మారిన పంత్.. అందుకు తగ్గేట్లే రాణిస్తున్నాడు.. వీరేంద్ర సెహ్వాగ్ పరిచయం చేసినా అగ్రెసివ్ అటాకింగ్ ప్లేతో ఒంటి చేత్తో మ్యాచ్లు గెలిపిస్తున్నాడు. అలాగే శ్రేయస్ అయ్యర్ కూడా అద్భుతంగా రాణిస్తూ.. టీమిండియా మాజీ ఛాంపియన్ యువరాజ్ లేని లోటును భర్తీ చేస్తున్నాడు. వీళ్లిద్దరూ ఇలాగే కొనసాగితే.. టేలర్ చెప్పినట్లు భవిష్యత్తులో ప్రపంచ క్రికెట్ను ఏలడం ఖాయంగా కనిపిస్తుంది. పైగా ఇద్దరిలోనూ నాయకత్వ లక్షణాలు మెండుగా ఉండడం అదనపు బలం.
ప్రస్తుత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తర్వాత వీరిద్దరిలో ఒకరికి టీమిండియా పగ్గాలు అందే అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్కు పంత్, కోల్కత్తా నైట్ రైడర్స్కు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్లుగా వ్యవహరిస్తున్నారు. ఏది ఏమైనా రాస్ టేలర్ చెప్పినట్లు వీరిద్దరూ భవిష్యత్తులో ఇండియన్ క్రికెట్ను మరింత హైట్స్కు తీసుకెళ్లాలని క్రికెట్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మరి టేలర్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: తనలో దాగి ఉన్న స్పెషల్ టాలెంట్ను బయటపెట్టిన ధావన్
— Sayyad Nag Pasha (@PashaNag) March 26, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.