టీమిండియా విజయవంతమైన కెప్టెన్ గా హిట్ మ్యాన్ రోహిత్ శర్మ దూసుకుపోతున్నాడు. కెప్టెన్ గా పగ్గాలు చేపట్టాక అతడు ఆడిన ఏ ఒక్క మ్యాచ్ లో కూడా ఇండియా ఓడిపోలేదు.ఈ క్రమంలో అనేక రికార్డులు బద్దలు కొట్టుకుంటూ జైత్రయాత్ర కొనసాగిస్తున్నాడు. తాజాగా శనివారం ఇంగ్లండ్ తో జరిగిన రెండో టీ-20 విజయంతో మరొ చరిత్రకు కొద్ది దూరంలో ఉన్నాడు. రోహిత్ శర్మ ఖాతాలో మరో విజయం చేరితే, ఆసీస్ మాజీ దిగ్గజం రికీ పాంటింగ్ సరసన నిలుస్తాడు. అదే రెండు మ్యాచులు గెలిస్తే పాంటింగ్ రికార్డును బద్దలు కొడతాడు.
అంతర్జాతీయ క్రికెట్ లో టెస్టులు, వన్డేలు, టీ20ల్లో ఓటమనేదే లేకుండా అత్యధిక మ్యాచులు గెలిచిన సారథిగా ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ కు అరుదైన రికార్డు ఉంది. ఆసీస్ సారథిగా అతడు వరుసగా 20 విజయాలు సాధించాడు. 2003-04లో పాంటింగ్ ఈ ఘనత అందుకున్నాడు. అయితే తాజాగా పాంటింగ్ రికార్డును సమం చేయడానికి రోహిత్ శర్మ ఒక అడుగుదూరంలో నిలిచాడు. సారథిగా హిట్ మ్యాన్.. శనివారం ఇంగ్లండ్ తో ముగిసిన టీ20తో కలిపి 19 మ్యాచుల్లో వరుస విజయాలు అందుకున్నాడు. టెస్టులు, వన్డేలు, టీ20లు అన్నీ ఇందులో కలిపే. ఈ క్రమంలో జూలై 10 ఇంగ్లండ్ తో జరగబోయే ఆఖరి టీ20 గెలిస్తే రోహిత్, పాంటింగ్ రికార్డును సమం చేస్తాడు. దీంతో పాటు ఈ జులై 12న ఇంగ్లండ్ తో జరగనున్న తొలి వన్డేలో కూడా గెలిస్తే పాంటింగ్ రికార్డులు బద్దలు కొట్టి..రోహిత్ తన పేరిట రికార్డు నెలకొల్పుతాడు.
ఓటమి ఎరుగకుండా రోహిత్ వరుస 19 విజయాల ఇవి.. టీమిండియాకు పూర్తిస్థాయి కెప్టెన్ కాకముందు బంగ్లాదేశ్ పై 2 విజయాలు సాధించాడు. టీ20లలో ఫుల్ టైం కెప్టెన్ అయ్యాక న్యూజిలాండ్ తో 3 టీ20లు గెలిచాడు. మరియు వెస్టిండీస్ తో 3వన్డేలు, 2 టీ-20, శ్రీలంకతో 3 టీ-20లు, రెండు టెస్టులు, ఇప్పుడు ఇంగ్లండ్ తో రెండు టీ20లలో రోహిత్ సారథ్యంలో టీమిండియా విజయం సాధించింది. మరి.. రోహిత్ జైత్రయాత్రపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.