రిషబ్ పంత్.. టీమిండియాలో ఈ పేరు ఇప్పుడు రీసౌండ్ వస్తోంది. కీపర్ గా, బ్యాట్స్ మన్ గా పంత్ ఆల్రౌండ్ ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంటోంది. మహేంద్రసింగ్ ధోనీ లేని లోటు తీర్చడమే కాదు.. జట్టులో ఒక కీలక ప్లేయర్ గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. అంతేకాదు గురవు ధోనీ వల్ల కూడా కాని ఓ అవార్డు దక్కించుకుని మరొకసారి టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచాడు. ధోనీ 90 టెస్టులు ఆడినా కూడా మ్యాన్ ఆఫ్ ది సిరీస్ గా నిలవలేకపోయాడు. కానీ, పంత్ తాజాగా శ్రీలంకపై టెస్టు సిరీస్లో మ్యాన్ ఆఫ్ ది సిరీస్ గా నిలిచి ఆ ఘనత సాధించాడు.
ఇదీ చదవండి: IPL 2022 నిబంధనల్లో కొత్త మార్పులు!
ప్రస్తుతం పంత్ పై ప్రశంసల జల్లు కురుస్తోంది. గురువుని మించిన శిష్యుడు అంటూ అందరూ కొనియాడుతున్నారు. ఒక్క ధోనీనే కాదు.. గతంలో టీమిండియా వికెట్ కీపర్లుగా పని చేసిన వృద్ధిమాన్ సాహా, కిరణ్ మోరే, సయ్యద్ కిర్మాణి వంటి కీపర్లు జట్టుకు అద్భుత సేవలు అందించారు. కానీ, వారి ఎవరి వల్లా కానిది ఇప్పుడు రిషబ్ పంత్ చేసి చూపించాడు. మ్యాన్ ఆఫ్ ది సిరీస్ సాధించిన తొలి భారత వికెట్ కీపర్ గా పంత్ చరిత్ర సృష్టించాడు.
Rishabh Pant post match interview after winning Man of the series. #INDvSL pic.twitter.com/HH5RC1k9fl
— One Handed Six Academy (@1handed_6) March 15, 2022
Excellent piece of stumpings from Rishabh Pant. #RishabhPant pic.twitter.com/XeJ6gxE9Dy
— Rishabh Daily (@rishabhdaily) March 14, 2022
శ్రీలంక టూర్ ఆఫ్ ఇండియా-2022లో భాగంగా జరిగిన టెస్టు సిరీస్ లో రిషబ్ పంత్ చెలరేగిపోయాడు. రెండు టెస్టుల్లోనూ టీ20 తరహా బ్యాటింగ్ తో విజృంభించాడు. 3 ఇన్నింగ్స్ లో 120 స్ట్రైక్ రేట్, 61 సగటుతో బ్యాటింగ్ చేసిన పంత్ 185 పరుగులు నమోదు చేశాడు. మొహాలిలో 97 బంతుల్లో 96 పరుగులు, బెంగళూరు టెస్టులో మొదటి ఇన్నింగ్స్ లో 26 బంతుల్లో 39, రెండో ఇన్నింగ్స్ లో 30 బంతుల్లో 50 రన్స్ స్కోర్ చేశాడు. 3 ఇన్నింగ్స్ లో 23 ఫోర్లు, 6 సిక్సులు కూడా బాదాడు. ఇదే తరహా ఫామ్ కొనసాగితే రిషబ్ పంత్ ఇంకా ఎన్నో రికార్డులను కొల్లగొడతాడు, టీమిండియాను మరెన్నో విజయ తీరాలు చేర్చుతాడంటూ క్రికెట్ పండితులు ప్రశంసిస్తున్నారు. రిషబ్ పంత్ ఫామ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
#RP17 out there breaking Test records like depositing the ball over mid-wicket 👉🏼 Just for fun 😉🔥#INDvSL #YehHaiNayiDilli @RishabhPant17 pic.twitter.com/p5VdkRry60
— Delhi Capitals (@DelhiCapitals) March 15, 2022