దాదాపు రెండు నెలలపాటు క్రీడాలోకాన్ని అలరించిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ ముగిసింది. ఫైనల్ వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఐపిఎల్ చెన్నై, గుజరాత్ ఫైనల్ మ్యాచ్ లో సిఎస్ కె ఐదోసారి టైటిల్ ను తన ఖాతాలో వేసుకుంది. ఇక ఇప్పుడు ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ కోసం భారత ఆటగాళ్లు సన్నద్ధమవుతున్నారు. జూన్ 7-12 మధ్యలో జరిగే డబ్య్లూటిసి ఫైనల్ కోసం టీమిండియా ఆస్ట్రేలియా జట్లు ఓవల్ మైదానానికి చేరుకున్నాయి. ఈ మ్యాచ్ లో ఎలాగైన విజయం సాధించాలని ఇరు జట్లు పట్టుదలతో ఉన్నాయి. అయితే తాజాగా భారత క్రికెట్ మాజీ ఛీఫ్ సెలెక్టర్ డబ్య్లూటిసి ఫైనల్ మ్యాచ్ కు సంబంధించి పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
దాదాపు రెండు నెలలపాటు క్రీడాలోకాన్ని అలరించిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ ముగిసింది. ఫైనల్ వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఐపిఎల్ చెన్నై, గుజరాత్ ఫైనల్ మ్యాచ్ లో సిఎస్ కె ఐదోసారి టైటిల్ ను తన ఖాతాలో వేసుకుంది. ఇక ఇప్పుడు ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ కోసం భారత ఆటగాళ్లు సన్నద్ధమవుతున్నారు. జూన్ 7-12 మధ్యలో జరిగే డబ్య్లూటిసి ఫైనల్ కోసం టీమిండియా ఆస్ట్రేలియా జట్లు ఓవల్ మైదానానికి చేరుకున్నాయి. ఈ మ్యాచ్ లో ఎలాగైన విజయం సాధించాలని ఇరు జట్లు పట్టుదలతో ఉన్నాయి. అయితే తాజాగా భారత క్రికెట్ మాజీ ఛీఫ్ సెలెక్టర్ డబ్య్లూటిసి ఫైనల్ మ్యాచ్ కు సంబంధించి పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
ఎంఎస్కే ప్రసాద్ ఎపికి చెందిన క్రికెట్ క్రీడాకారుడు. ఇతడు 2016లో ఇండియా క్రికెట్ ఎంపిక సంఘానికి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అయితే ఎంఎస్కే ప్రసాద్ డబ్య్లూటిసి ఫైనల్ కు ముందు టీమిండియాకు కీలక సూచనలు చేశారు. 2021లో కివిస్ తో జరిగిన డబ్య్లూటిసి ఫైనల్ మ్యాచ్ లో చేసిన తప్పులను మళ్లీ చేయవద్దని హెచ్చరించారు. ఇప్పటికే టీమిండియా మేనేజ్ మెంట్ తుది జట్టు ఎంపిక కోసం కసరత్తు చేస్తోంది. న్యూజీలాండ్ తో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో పిచ్ పేస్ బౌలింగ్ కు అనుకూలంగా ఉన్నప్పటికి ఇద్దరు స్పిన్నర్లను రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా ఆడించి టీమిండియా ఓటమికి కారణమైందని తెలిపారు. ఇప్పుడు అలా జరగకుండా ఉండేందుకు పిచ్ పరిస్థితిని బట్టి జట్టును ఎంపిక చేయాలని సూచించారు. బౌలింగ్ విభాగం పైనే దృష్టి సారించాలని తెలిపారు. కాగా ఈ సారి తుది జట్టును ముందే ఎంపిక చేయకుండా మ్యాచ్ ప్రారంభమయ్యే ముందు ఉన్న పరిస్థితులను బట్టి జట్టును సెలెక్టు చేయాలని సూచించారు.
ఓవల్ పిచ్ స్పిన్ కు అనుకూలించే అవకాశం ఉన్నప్పటికి పరిస్థితులను బట్టి మ్యాచ్ తొలిరోజే నిర్ణయం తీసుకోవాలని ఎంఎస్ కె తెలిపారు. ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతూ.. 2021 భారత్, కివిస్ ఫైనల్ మ్యాచ్ లో ఇద్దరు స్పిన్నర్లు, ముగ్గురు ఫాస్ట్ బౌలర్లను తుది జట్టులో ఎంపిక చేశామని, వర్షం పడడంతో పిచ్ పరిస్థితి మారిపోయిందని తెలిపారు. అయినప్పటికి తుది జట్టులో ఇద్దరు స్పిన్నర్లను తీసుకుని కివిస్ తో మ్యాచ్ ఆడామని తెలిపారు. అయితే వర్షం కారణంగా మ్యాచ్ అనేక మలుపులు తిరుగుతూ టీమిండియా ఓటమి పాలైంది. ఇదిలా ఉండగా భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్ గురించి మాట్లాడుతూ టెస్టుల్లో అతడి స్థానాన్ని భర్తీ చేయడం కష్టమని చెప్పారు. టెస్టు మ్యాచ్ లో రోజంతా కీపింగ్ చేయగల సత్తా ఉండాలని తెలిపారు. ప్రస్తుతం వికెట్ కీపర్లుగా డబ్య్లూటిసి ఫైనల్ జట్టులో కెఎస్ భరత్, ఇషాన్ కిషన్ ఉన్నారు. తుది జట్టులో కెఎస్ భరత్ కె స్థానం దక్కే అవకాశం ఉందని ఎంఎస్ కె తెలిపారు.