దాదాపు రెండు నెలలపాటు క్రీడాలోకాన్ని అలరించిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ ముగిసింది. ఫైనల్ వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఐపిఎల్ చెన్నై, గుజరాత్ ఫైనల్ మ్యాచ్ లో సిఎస్ కె ఐదోసారి టైటిల్ ను తన ఖాతాలో వేసుకుంది. ఇక ఇప్పుడు ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ కోసం భారత ఆటగాళ్లు సన్నద్ధమవుతున్నారు. జూన్ 7-12 మధ్యలో జరిగే డబ్య్లూటిసి ఫైనల్ కోసం టీమిండియా ఆస్ట్రేలియా జట్లు ఓవల్ మైదానానికి చేరుకున్నాయి. ఈ మ్యాచ్ లో ఎలాగైన విజయం సాధించాలని ఇరు జట్లు పట్టుదలతో ఉన్నాయి. అయితే తాజాగా భారత క్రికెట్ మాజీ ఛీఫ్ సెలెక్టర్ డబ్య్లూటిసి ఫైనల్ మ్యాచ్ కు సంబంధించి పలు కీలక వ్యాఖ్యలు చేశారు.