క్రీడా ప్రపంచంలో ఒలింపిక్స్ కు ప్రత్యేక స్థానం ఉంది. ఆ తర్వాత అంతటి స్థాయి ఉన్న క్రీడలు కామన్వెల్త్ .. ప్రస్తుతం బర్మింగ్ హామ్ వేదికగా కామన్వెల్త్ క్రీడలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ పతకాల పంట పండిస్తోంది. తనకు అచ్చొచ్చిన రంగమైన వెయిట్ లిఫ్టింగ్ లో అదరగొడుతోంది. ఇప్పటికే రజత, కాంస్య పతకాలతో ఖాతా తెరవగా, తాజాగా ఈ రంగంలో భారత్ పసిడి పతకంతో మెరిసింది. దానికి సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
టోక్యో ఒలింపిక్స్ లో రజతం.. ఆ రికార్డ్ సాధించిన తొలి వెయిట్ లిఫ్టర్.. అదీ కాక క్లీన్ అండ్ జర్క్ లో 119 కేజీలు ఎత్తి ప్రపంచ రికార్డ్ ప్రదర్శన.. ఇలా తనదైన శైలిలో దూసుకుపోతోంది ఓ వీర వనిత. ఆమె ఎవరో కాదు.. మీరాబాయి చాను.. కామన్వెల్త్ క్రీడల నేపథ్యంలో విదేశాల్లో కఠిన శిక్షణ ప్రారంభించింది. దానికి తోడు ఎప్పటికప్పుడు తననుతాను మార్చుకుంటూ ముందుకు దూసుకెళ్తోంది. ఈ క్రమంలోనే భారత వెయిట్ లిఫ్టింగ్ సమాఖ్య (ఐడబ్ల్యూఎల్ఎఫ్) చానును 55 కేజీల విభాగానికి మారాలని సూచించింది. కానీ ఒక్క విభాగం నుంచి అత్యుత్తమ వెయిట్ లిఫ్టర్ మాత్రమే క్రీడలకు ఎంపిక అవుతారనే నిబంధనతో తిరిగి 49 కేజీల్లోనే పొటికిదిగింది.
Lifting 201kg never felt easy but thanks to the love and wishes of billions back home, every challenge is just an attempt away. 🇮🇳#WeAreTeamIndia #TeamIndia pic.twitter.com/GnyaftZkpv
— Saikhom Mirabai Chanu (@mirabai_chanu) July 30, 2022
కామన్వెల్త్ క్రీడల్లో భారత పతకాల పంట పండుతోంది. ఈ క్రమంలో శనివారం భారత వెయిట్ లిఫ్టర్లు అద్భుత ప్రదర్శన చేయడంతో ఒక్క రోజే మూడు పతకాలు వచ్చాయి. మహిళల 49 కేజీల విభాగంలో మీరాబాయి చాను స్వర్ణ పతకం సాధించింది. ఫేవరెట్ గా బరిలోకి దిగిన చాను 201 కేజీల (88+113) బరువును ఎత్తి కామన్వెల్త్ క్రీడల రికార్డ్ ను బద్దలు కొట్టింది. ఇక హనిత్ర (172 కేజీలు, మారిషస్) రెండవ స్థానంలో, కమిన్ స్కి (171 కేజీలు, కెనడా)లు మూడో స్థానంలో నిలిచారు.
Screenshot at 0.27 for a new wallpaper and celebrate the legend of Mirabai Chanu. 🏋️♀️🥇👏pic.twitter.com/as22RGOhwc
— Rajasthan Royals (@rajasthanroyals) July 30, 2022
చాను స్నాచ్ లో తొలి ప్రయత్నంలోనే 84 కేజీలు ఎత్తింది. ఆ తర్వాత 88 కేజీల బరువు ఎత్తి అగ్రస్థానంలో నిలిచింది. చివరి ప్రయత్నంలో 90 కేజీల బరువు ఎత్తడంలో విఫలం అయినప్పటికీ క్లీన్ అండ్ జర్క్ లో తొలి సారే 109 కేజీలు ఎత్తి గోల్డ్ మెడల్ ఖాయం చేసుకుంది. ఇక రెండో ప్రయత్నంలో 113 కేజీలు ఎత్తింది. మూడో ప్రయత్నంలో మాత్రం 115 కేజీలు లేపడంలో విఫలం అయ్యింది. కానీ అప్పటికే చానుకు స్వర్ణం ఖాయం అయ్యింది. దీంతో ప్రధాని మోదీ సైతం చానును ‘మీరాబాయి చాను భారత్ ను మరోసారి గర్వపడేలా చేసింది’. అంటూ పతకాలు సాధించిన లిఫ్టర్లను ట్విట్టర్ ద్వారా ప్రశంసించాడు. పురుషుల 55 కేజీల విభాగంలో సంకేత్ కు రజతం, 61 కేజీల విభాగంలో గురురాజ కు కాంస్యం నెగ్గిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో భారత్ కు మరిన్ని పతకాలు రావాలని ఆశిస్తూ.. దేశం గర్వించే ప్రదర్శన చేసిన వెయిట్ లిఫ్టర్ల పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
🇮🇳✌️ pic.twitter.com/ZAn1zqR9ri
— Saikhom Mirabai Chanu (@mirabai_chanu) July 31, 2022
ఇదీ చదవండి: Sikandar Raza: బంగ్లాదేశ్ను చిత్తు చేసిన జింబాబ్వే! విధ్వంసం సృష్టించిన రజా
ఇదీ చదవండి: మళ్లీ టీమిండియా కెప్టెన్గా శిఖర్ ధావన్! BCCI రిక్వెస్ట్ను తిరస్కరించిన కోహ్లీ