బంగ్లాదేశ్తో జరిగిన తొలి టీ20లో జింబాబ్వే ఆటగాడు సికందర్ రజా రెచ్చిపోయి ఆడాడు. బంగ్లా బౌలర్లను ఊచకోత కోస్తూ.. 250 స్ట్రైక్రేట్తో బ్యాటింగ్ చేశాడు. మూడు టీ20ల సిరీస్లో భాగంగా శనివారం బంగ్లాదేశ్తో జరిగిన తొలి మ్యాచ్లో రజా సునామీ ముంచెత్తింది. ఈ ఇన్నింగ్స్తో జింబాబ్వే 17 పరుగుల తేడాతో విజయం సాధించింది. 36 ఏళ్ల సికందర్ 26 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్లతో 65 పరుగుల సుడిగాలి ఇన్నింగ్స్ ఆడాడు. ఇక మ్యాచ్ విషయానికొస్తే.. మొదట బ్యాటింగ్ చేసిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 205 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది. సికందర్తో పాటు వెస్లీ మదెవెరె (46 బంతుల్లో 67) రాణించారు. సీన్ విలియమ్స్ (19 బంతుల్లో 33) చివర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అనంతరం భారీ లక్ష్య ఛేదనలో బంగ్లా గట్టిగానే పోరాడింది. కెప్టెన్ నరుల్ హసన్ (26 బంతుల్లో 42 నాటౌట్), లిటన్ దాస్ (19 బంతుల్లో 32) జట్టును గెలిచేందుకు చివరివరకు ప్రయత్నించారు. అయితే ఇతర ఆటగాళ్లు విఫలమవ్వడంతో నిర్ణీత 20 ఓవర్లలో 188 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది. Sikandar Raza's fireworks in front of a packed house in Harare sets Zimbabwe up for the series lead over Bangladesh #ZIMvBAN https://t.co/Wu34A6XyW2 pic.twitter.com/2ueSaHfjP2 — ESPNcricinfo (@ESPNcricinfo) July 30, 2022