ఆగస్ట్ 18 నుంచి ప్రారంభం కాబోయే మూడు వన్డేల సిరీస్ కోసం జింబాబ్వే పర్యటకు వెళ్లే భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. 15 మంది సభ్యులతో కూడిన జట్టు వివరాలను చేతన శర్మ సారథ్యంలోని సెలెక్షన్ కమిటీ శనివారం వెల్లడించింది. టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు ఇతర సీనియర్ ఆటగాళ్లందరికీ ఈ పర్యటన నుంచి రెస్ట్ ఇచ్చారు. అలాగే మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీని ఈ పర్యటనకు ఎంపిక చేస్తారని ప్రచారం జరిగినా.. సెలెక్షన్ కమిటీ అతన్ని ఎంపిక చేయలేదు. దాంతో విరాట్ ఆసియాకప్తోనే రీఎంట్రీ ఇవ్వనున్నాడు. రిషభ్ పంత్, హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ, రవీంద్ర జడేజా, యుజ్వేంద్ర చాహల్కు కూడా ఈ టూర్ నుంచి విశ్రాంతి ఇచ్చారు. వెస్టిండీస్ పర్యటనలో కెప్టెన్గా మంచి ఫలితం రాబట్టిన శిఖర్ ధావన్కే మళ్లీ సారథ్య బాధ్యతలు అప్పగించారు. గాయంతో జట్టుకు దూరంగా ఉన్న దీపక్ చాహర్, వాషింగ్టన్ సుందర్లు ఈ పర్యటనతో మళ్లీ జట్టులోకి రీఎంట్రీ ఇవ్వనున్నారు. ఐపీఎల్ 2022 సీజన్కు ముందు గాయపడ్డ దీపక్ చాహర్ మళ్లీ ఇన్నాళ్లకు మైదానంలోకి బరిలోకి దిగుతున్నాడు. కౌంటీ క్రికెట్లో సత్తా చాటుతున్న సుందర్ సైతం చాలా రోజుల మళ్లీ జట్టులో అవకాశం దక్కించుకున్నాడు. రాహుల్ త్రిపాఠి మరోసారి భారత జట్టు పిలుపు అందుకోగా.. సిరాజ్, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, ఆవేశ్ ఖాన్, ప్రసిద్ధ్ కృష్ణలు కొనసాగుతున్నారు. ఆగస్టు 18 నుంచి ఈ మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది. ఆగస్టు 18న తొలి వన్డే, 20న రెండో వన్డే, ఆగస్టు 22న మూడో వన్డే జరగనుంది. ఈ పర్యటన అనంతరం ఆసియాకప్ మొదలు కానుంది. BCCI రిక్వెస్ట్ను తిరస్కరించిన కోహ్లీ..! కాగా ఇంగ్లండ్ పర్యటన తర్వాత విరాట్ కోహ్లీ విశ్రాంతి తీసుకుంటున్న విషయం తెలిసిందే. అందుకే వెస్టిండీస్తో వన్డే, టీ20 సిరీస్కు కోహ్లీని ఎంపిక చేయలేదు. ఆసియా కప్తో మళ్లీ జట్టులోకి వస్తాడనే విషయాన్ని సెలెక్టర్లు అప్పుడే ప్రకటించారు. కానీ.. ఫామ్లేమితో ఇబ్బంది పడుతున్న కోహ్లీని ఫామ్లోకి తెచ్చేందుకు బీసీసీఐ పెద్దలు ఒక ప్లాన్ చేసినట్లు విషయం తెలిసిందే. అదే.. కోహ్లీని జిబాంబ్వేతో వన్డే సిరీస్ ఆడించడం. చిన్నజట్టుపై మూడు మ్యాచ్లు ఆడి.. కొన్ని పరుగులు చేయగలిగితే.. ఆత్మవిశ్వాసం పుంచుకుని ఆసియా కప్, ఆ తర్వాత జరగనున్న టీ20 వరల్డ్ కప్ టైమ్ కల్లా కోహ్లీ ఫామ్లో ఉంటాడనే ఉద్దేశంతో బీసీసీఐ పెద్దలు జింబాబ్వే టూర్కు వెళ్లాల్సిందిగా కోహ్లీని కోరినట్టు వార్తలు వచ్చాయి. కానీ.. జింబాబ్వేతో మూడు వన్డేల సిరీస్ కోసం ఎంపిక చేసిన జట్టులో కోహ్లీ పేరు లేకపోవడంతో బీసీసీఐ రిక్వెస్ట్ను కోహ్లీ తిరస్కరించినట్లు తెలుస్తుంది. డైరెక్ట్గా ఆసియాకప్తోనే జట్టులోకి వస్తానని కోహ్లీ తేల్చిచెప్పినట్లు సమాచారం. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. బాబ్వేతో వన్డే సిరీస్కు ఎంపికైన భారత జట్టు: శిఖర్ ధావన్(కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, శుభ్మన్ గిల్, దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి, ఇషాన్ కిషన్, సంజూ శాంసన్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, అవేశ్ ఖాన్, ప్రసిధ్ కృష్ణ, మహమ్మద్ సిరాజ్, దీపక్ చాహర్