భారత క్రికెట్ జట్టులో విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉన్న క్రికెటర్గా విరాట్ కోహ్లీని చెబుతుంటారు. ఆ మాటకొస్తే.. ప్రస్తుత ప్రపంచ క్రికెట్లో అత్యధిక మంది ఇష్టపడే క్రికెటర్ కోహ్లీనేనని అంటుంటారు. అలాంటి కోహ్లీతో ఫొటో దిగే అవకాశం వస్తే ఎవరూ మిస్ చేసుకోరు. అలాంటి చాన్స్ వచ్చినప్పుడు విరాట్ లేడీ ఫ్యాన్ చేసిన చర్య నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
టీమిండియా క్రికెటర్లలో విరాట్ కోహ్లీకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కోహ్లీ ప్రొఫెషనల్ కెరీర్తో పాటు పర్సనల్ లైఫ్లోనూ జరిగే అన్ని ఆసక్తికరమైన విషయాలను అభిమానులు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తారు. మైదానంలో అద్భుతమైన ఇన్నింగ్స్లు ఆడే విరాట్.. బయట కూడా స్టయిల్, లుక్స్తో అందర్నీ ఆకట్టుకుంటాడు. అందుకే విరాట్ అంటే ఫ్యాన్స్ విపరీతంగా ప్రేమను కనబరుస్తారు. అతడితో ఒక ఫొటో దిగే అవకాశం ఎప్పుడొస్తుందా, విరాట్ను దగ్గర నుంచి చూసే చాన్స్ దొరుకుతుందా అని ఆలోచిస్తుంటారు. అలాంటిది ఒక లేడీ ఫ్యాన్ అభిమాన క్రికెటర్పై తన ఇష్టాన్ని కనబర్చిన తీరు వైరల్ అవుతోంది.
విరాట్ కోహ్లీ మైనపు బొమ్మను చూసేందుకు మ్యూజియమ్కు వచ్చిన యువతి.. తన ఫేవరెట్ క్రికెటర్ స్టాచ్యూను చూసి సంతోషం పట్టలేకపోయింది. వెంటనే విరాట్ మైనపు బొమ్మను వాటేసుకుని, లిప్ కిస్ చేసిందా యువతి. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఢిల్లీలోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఇటీవల ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. కోహ్లీ మైనపు విగ్రహాన్ని ఆ యువతి ముద్దుపెట్టుకుంటుండగా ఆమె ఫ్రెండ్ దీన్ని తన ఫోన్లో బంధించింది. ఆ తర్వాత ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో నెటిజన్స్ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.
విరాట్ మైనపు విగ్రహం పాడవుతోందని ఒకరు కామెంట్ చేయగా.. ఇది చూసేందుకేనా నేను బతికున్నది అంటూ మరో యూజర్ కామెంట్ చేశాడు. మెన్ క్రికెటర్ బొమ్మను అమ్మాయిలు ముద్దు పెట్టుకుంటే ఎవరూ ఏమీ అనట్లేదని.. అదే విమెన్ క్రికెటర్ బొమ్మను అబ్బాయిలు కిస్ చేస్తే ఊరుకునేవారా అంటూ మరో నెటిజన్ ప్రశ్నించాడు. మరొకరేమో ఈ వీడియోను కోహ్లీ సతీమణి అనుష్క శర్మ చూస్తే పరిస్థితి ఏంటని సరదాగా కామెంట్ చేశాడు. మరి.. విరాట్ మైనపు బొమ్మను లేడీ ఫ్యాన్ కిస్ చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Yeh dekhne se pehle main mar kyu nahi gayi😭😭😭😭 pic.twitter.com/vpTjmGXNUy
— Viratian forever! (@viratdiaries_) February 19, 2023