నాలుగో టెస్టులో కోహ్లీ మరోసారి సీరియస్ అయ్యాడు. అది కూడా కేఎస్ భరత్ పైనే. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఇంతకీ అసలు ఏం జరిగింది?
బోర్డర్ గావస్కర్ ట్రోఫీ యమ రంజుగా సాగుతోంది. నాలుగో టెస్టులో ఏ జట్టు కూడా విజయం సాధించేలా కనిపించడం లేదు. ఆస్ట్రేలియా తొలుత 480 పరుగుల భారీ స్కోరు చేయగా, ప్రస్తుతం బ్యాటింగ్ చేస్తున్న టీమిండియా.. ఆ మొత్తానికి చేరువలో ఉంది. ఇప్పటికే సిరీస్ లో ఆధిక్యంలో ఉన్నప్పటికీ ఈ మ్యాచులో గెలిస్తేనే భారత జట్టు.. టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ కు అర్హత సాధిస్తుంది. కానీ అది జరిగేలా కనిపించడం లేదు. అయితే నాలుగో రోజు ఆటలో మాత్రం కాస్త సీరియస్ సిట్చూయేషన్ కనిపించింది. కేఎస్ భరత్ పై కోహ్లీ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అందుకు సంబంధించిన ఓ వీడియో కూడా ఇప్పుడు వైరల్ గా మారింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టు తొలిరోజు ఆటలో కోహ్లీ, వికెట్ కీపర్ కేఎస్ భరత్ పై సీరియస్ అయ్యాడు. ఉస్మాన్ ఖవాజా పట్ల భరత్ తీరును తప్పుబడుతూ సారీ చెప్పమని ఆదేశించాడు. షమి వేసిన బౌన్సర్ ఖవాజా తప్పించుకోవడంతో అదికాస్త భరత్ చేతుల్లో పడింది. బంతిని తిరిగి షమికి విసిరే ప్రయత్నంలో అది ఖవాజా చేతి వేలికి బలంగా తాకింది. దీంతో ఖవాజా భరత్ వైపు చూశాడు. అప్పుడు కల్పించుకున్న కోహ్లీ.. వెళ్లి క్షమాపణ చెప్పాలని భరత్ ని ఆదేశించాడు. ఇప్పుడు ఇది మరిచిపోకముందే తెలుగు కుర్రాడు భరత్ పై కోహ్లీ మరోసారి సీరియస్ అయ్యాడు.
ఆహ్మదాబాద్ నాలుగో రోజు ఆటలో భాగంగా బ్యాటింగ్ షురూ చేసిన టీమిండియా ఆచితూచి ఆడింది. 28 పరుగులు చేసిన జడేజా ఔటైపోవడంతో భరత్ బ్యాటింగ్ కు దిగాడు. అయితే ఓ ఓవర్ సందర్భంగా లెగ్ సైడ్ బంతిని కొట్టిన కోహ్లీ.. సింగిల్ తీసే ప్రయత్నం చేశాడు. కానీ అవతల వైపు క్రీజులో ఉన్న భరత్ మాత్రం వద్దు అన్నట్లు బ్యాటుతో సైగ చేశాడు. అప్పటికే కాస్త దూరం వచ్చేసిన కోహ్లీ.. తిరిగి వెనక్కి వెళ్లిపోయాడు. అయితే సేఫ్ గా క్రీజులోకి వచ్చేసిన కోహ్లీ.. భరత్ వైపు సీరియస్ గా చూస్తూ కనిపించాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇలా ఒకే మ్యాచులో భరత్ పై కోహ్లీ రెండుసార్లు సీరియస్ కావడంపై మీరేం అంటారు. కింద కామెంట్ చేయండి.
what shashtri said pic.twitter.com/seyp1JbNY7
— check pinned (@viratxakshay) March 12, 2023