ఎప్పుడూ బ్యాటుతో కనిపించే గిల్, పుజారా.. అహ్మదాబాద్ టెస్టులో బౌలింగ్ చేశారు. ఇది కాస్త చూసేవాళ్లకు యమ ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. ఇంతకీ వీళ్లిద్దరూ బౌలింగ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది?
జస్ట్ మిస్... కోహ్లీ డబుల్ సెంచరీ ఛాన్స్ చేజేతులా మిస్ అయిపోయింది. అశ్విన్ అలా చేయకుండా కాస్త క్రీజులో స్టాండింగ్ ఇచ్చి ఉంటే మాత్రం కోహ్లీ పేరిట సరికొత్త రికార్డులు నమోదయ్యేవి. ఇంతకీ ఏం జరిగింది?
కేఎస్ భరత్ ఆస్ట్రేలియాతో నాలుగో టెస్టులో తన పవర్ ఫుల్ బ్యాటింగ్ చూపించాడు. గ్రీన్ బౌలింగ్ లో ఒకే ఓవర్ లో 6,6,4 కొట్టి కేక పుట్టించాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఓ వీడియో వైరల్ కూడా కావడం విశేషం.
ఆస్ట్రేలియాతో నాలుగో టెస్టులో కోహ్లీ సెంచరీ చేసేశాడు. దాదాపు మూడేళ్ల వెయిటింగ్ కు ఎండ్ కార్డ్ వేస్తూ సుధీర్ఘ ఫార్మాట్ లో మూడంకెల స్కోరుని అందుకున్నాడు. దీంతో కోహ్లీ ఖాతాలో 75వ సెంచరీ చేరింది.
టీమిండియా స్టార్ క్రికెటర్.. అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టు మధ్యలో గాయపడ్డాడు. నొప్పి తిరగబెట్టడంతో అతడిని స్కానింగ్ కు పంపినట్లు తెలుస్తోంది. మరోవైపు చివరిదైన నాలుగో టెస్టు డ్రా దిశగా సాగుతోంది.
.అహ్మదాబాద్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న కీలకమైన నాల్గవ టెస్టులో యువ బ్యాటర్ శుభమాన్ గిల్ సెంచరీతో మెరిశాడు. ఇప్పటికే వన్డే, టీ20 క్రికెట్ లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్న ఈ స్టార్ ఓపెనర్.. ఇప్పుడు టెస్ట్ క్రికెట్ లోనూ సత్తా చాటుతున్నాడు. 193 బంతుల్లో 10 ఫోర్లు, 1 సిక్సర్ సాయంతో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దీంతో భారత్ ఆస్ట్రేలియాకు ధీటుగానే బదులిస్తోంది.
ఆస్ట్రేలియా కెప్టెన్, స్టార్ క్రికెటర్ ప్యాట్ కమిన్స్ ఇంట్లో విషాదం నెలకొంది. దీంతో నాలుగో టెస్టులో ఆసీస్ ఆటగాళ్ల నల్ల బ్యాండ్స్ ధరించారు. ఇంతకీ కమిన్స్ ఇంట్లో ఎవరు చనిపోయారు?
బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీలో ఆసీస్తో ఆఖరి టెస్టులో తలపడేందుకు టీమిండియా సన్నద్ధమవుతోంది. అయితే తుది జట్టు ఎంపికపై మల్లగుల్లాలు పడుతోంది. ముఖ్యంగా కీపర్ శ్రీకర్ భరత్ జట్టులో ఉంటాడా లేదా అనే అనుమానాలు వస్తున్నాయి.
తొలి రెండు టెస్టుల్లో స్పిన్ మాయాజాలంతో ఆసీస్ పతనాన్ని శాసించిన భారత్, మూడో టెస్టులో ఆదే స్పిన్ ఆడలేక కళ్లు తేలేశారు. ఆసీస్ స్పిన్ త్రయం మాథ్యూ కుహ్నెమన్, నాథన్ లియోన్, టాడ్ మర్ఫీలను ఎదుర్కోలేక మ్యాచునే అప్పగించారు. ఆనాటి నుండి ఆటగాళ్ల వ్యక్తిగత ప్రదర్శనల కంటే అత్యధికంగా చర్చ జరుగుతున్నది పిచ్ల మీదనే. నాగ్పూర్, ఢిల్లీతో పాటు ఇటీవలే ముగిసిన ఇండోర్ పిచ్ మీద జరగిన చర్చ అంతా ఇంతా కాదు. ఇప్పుడు ఇంకా మొదలుకాని అహ్మదాబాద్ పిచ్ గురించి కూడా శూల శోధనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో స్వదేశంలో స్పిన్ ఫ్రెండ్లీ పిచ్లకు ఆద్యం పోసింది.. తయారుచేయమని చెప్పింది మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోని అని మాజీ పిచ్ క్యూరేటర్ దల్జిత్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.