ఎంత పెద్ద స్టార్ క్రికెటర్లు అయినా కెరీర్ చివర్లో కష్టాలు తప్పవు. సదరు స్టార్ ప్లేయర్స్ ఎన్నో రికార్డులు సాధించి ఉండొచ్చు. కానీ ఓ టైం వచ్చినప్పుడు వాళ్లే స్వయంగా తప్పుకోవాల్సి ఉంటుంది. లేదంటే సైలెంట్ గా తప్పించేస్తారు. ఇప్పుడు పరిస్థితులు చూస్తే అదే అనిపిస్తుంది. ఎందుకంటే కోచ్ రాహుల్ ద్రవిడ్ వ్యాఖ్యలు, బీసీసీఐ అధికారి ఒకరు చెప్పిన మాటలు వింటుంటే.. అదే నిజమేనేమో అనిపిస్తుంది. అందుకు తగ్గట్లే సిగ్నల్స్ కూడా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఇదే క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. టీమిండియా కెప్టెన్ గా ధోనీ తనదైన ముద్ర వేశారు. అతడి సారథ్యంలోనే కోహ్లీ, రోహిత్ శర్మ స్టార్ ప్లేయర్స్ గా మారారు. ఇక మహీ రిటైర్మెంట్ తర్వాత కోహ్లీ కెప్టెన్ అయ్యాడు. మనోడు మ్యాచులు, సిరీస్ లు గెలిపించినప్పటికీ.. ఐసీసీ టోర్నీల్లో కప్ కొట్టకపోయేసరికి విరాట్ ని కెప్టెన్సీ నుంచి తప్పించారు. గతేడాది రోహిత్ శర్మకు పరిమిత ఓవర్ల ఫార్మాట్ కు సారథిగా బాధ్యతలు అప్పగించారు. వ్యక్తి మారాడు తప్పితే రిజల్ట్ పెద్దగా ఏం మారలేదు. టీ20 ప్రపంచకప్ లో మన జట్టు సెమీస్ వరకే వెళ్లగలిగింది.
ఇక వచ్చే ఏడాది టీ20 వరల్డ్ కప్ ఉన్న నేపథ్యంలో కోహ్లీ, రోహిత్ లను విశ్రాంతి పేరు చెప్పి పక్కనబెట్టారు. అయితే రెస్ట్ తీసుకోమని ఇచ్చినట్లు లేదు. ఎందుకంటే శ్రీలంకతో టీ20 సిరీస్ కోసం హార్దిక్ పాండ్య కెప్టెన్సీలో జట్టు ఆడుతోంది. తొలి మ్యాచ్ లో గెలిచి, రెండో మ్యాచ్ లో ఓడింది. దీని తర్వాత కోచ్ రాహుల్ ద్రవిడ్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ‘భారత జట్టులోని కుర్రాళ్లలో మంచి ప్రతిభ ఉంది. వాళ్లు ఇంకా నేర్చుకునే దశలోనే ఉన్నారు. అయితే వారి విషయంలో కాస్త ఓపిక పట్టాలి. వచ్చే ఏడాది టీ20 వరల్డ్ కోసమే ఈ టీమ్ ని రెడీ చేస్తున్నాం. గతేడాది వరల్డ్ కప్ ఆడిన టీమ్ తో పోలిస్తే జట్టు చాలా మారింది. ముగ్గురు నలుగురు మాత్రమే ఉన్నారు’ అని ద్రవిడ్ చెప్పాడు.
ఇక ద్రవిడ్ చెప్పిన దాన్నిబట్టి చూస్తుంటే.. కోహ్లీ, రోహిత్ ఇక టీ20ల్లో కనిపించరు అని ఇన్ డైరెక్ట్ గా చెప్పేస్తున్నాడు. మరోవైపు ఈ ఇద్దరినీ త్వరలో న్యూజిలాండ్ తో జరిగి టీ20 సిరీస్ కు కూడా ఎంపిక చేయట్లేదని బీసీసీఐ అధికారి ఒకరు చెప్పారు. వారిద్దరికీ జట్టు నుంచి సైడ్ చేయడానికో, మరేదో కారణం కాదని.. భవిష్యత్ కోసం మంచి జట్టు నిర్మించాలని తాము ఇలా చేస్తున్నామని ఆయన అన్నారు. అలానే మిగతా సెలెక్టర్లు ఏం డెసిషన్ తీసుకుంటారో చూడాలని చెప్పారు. భువనేశ్వర్, అశ్విన్, షమిని కూడా కివీస్ తో టీ20 సిరీస్ నుంచి తప్పించే అవకాశముందని చెప్పారు. ఇదిలా ఉండగా శ్రీలంకతో టీ20లు ఆడతున్న టీమిండియా, ఆ తర్వాత వన్డే సిరీస్ ఆడనుంది. ఆ తర్వాత న్యూజిలాండ్ తో వన్డే సిరీస్ జరగనుంది. ఇక జనవరి 27, 29, ఫిబ్రవరి 1 తేదీల్లో భారత్-కివీస్ మధ్య టీ20లు జరగనున్నాయి. మరి కోహ్లీ, రోహిత్ లని టీ20లకు సెలెక్ట్ చేయకపోవడంపై మీ అభిప్రాయం ఏంటి? కింద కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
Replacing them is impossible. Team India will never have another Rohit Sharma and Virat Kohli.❤️💙
Rohirat is ♥️🥹#RohitSharma𓃵 #ViratKohli𓃵 #rohit#kohli#BCCI pic.twitter.com/5ZmCjLCrfI— K U N A L ⚓ (@kuna1___) January 5, 2023