Mitchell Johnson vs Yusuf Pathan: రెండ్రోజుల క్రితం లెజెండ్స్ లీగ్ క్రికెట్ 2022లో చోటుచేసుకున్న యూసఫ్ పఠాన్, మిచెల్ జాన్సన్ గొడవ అందరకి సంగతి తెలిసిందే. మైదానంలోనే గొడవకు దిగిన ఈ దిగ్గజ ఆటగాళ్లు దాదాపు కొట్టుకున్నంత పని చేశారు. లెజెండ్స్ లీగ్ అని పేరు పెట్టుకొని మైదానంలో ఇలా గొడవలకు దిగడం ఏంటని పెద్ద ఎత్తున విమర్శలొచ్చాయి. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న టోర్నీ నిర్వాహకులు మిచెల్ జాన్సన్ మ్యాచ్ ఫీజులో కోత కూడా విధించారు. ఇంతటితో గొడవ ముగిసిందని అంతా అనుకున్నారు. అయితే.. ఆస్ట్రేలియన్ మీడియా దీన్ని పెద్దది చేసేలా ఉంది. మహిళా అంపైర్ తో యూసఫ్ పఠాన్ దురుసుగా ప్రవర్తించడమే గొడవకు కారణమాని కథనాన్ని ప్రసారం చేస్తోంది. ఆ వివరాలు..
జోధ్ పూర్ వేదికగా బిల్వారా కింగ్స్, ఇండియా క్యాపిటల్స్ మధ్య క్వాలిఫయర్-1 మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచులో మహిళా అంపైర్ కిమ్ కాటన్ అంపైర్ గా విధులు నిర్వహించింది. కాగా, బిల్వారా కింగ్స్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఇండియా క్యాపిటల్స్ బౌలర్ మిచెల్ జాన్సన్ వేసిన ఇన్నింగ్స్ మూడో ఓవర్లో ఒక బంతిని కాటన్ వైడ్ కాల్ ఇవ్వలేదు. దీంతో ఆగ్రహానికి గురైన యూసఫ్ పఠాన్.. కాటన్ ను ఉద్దేశించి అభ్యంతకర వ్యాఖ్యలు చేసినట్లు ఆస్ట్రేలియన్ మీడియా వెల్లడించింది. ఇదే విషయమై ఓవర్ ముగిశాక ఇద్దరి మధ్య గొడవకు దారి తీసిందని పేర్కొంది. “గొడవలో జూన్సన్ తప్పేం లేదు.. మహిళా అంపైర్ తో పఠాన్ స్లెడ్జింగ్ కు దిగడమే కారణమని.. ” పేర్కొంది.
Revealed: Umpire sledge that sparked ugly T20 clash between Mitchell Johnson, Indian star | @ChristypDoran https://t.co/4WnwOJy0Ls
— Fox Cricket (@FoxCricket) October 4, 2022
భిల్వారా కింగ్స్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో యూసుఫ్ పఠాన్ క్రీజులో ఉండగా.. మిచెల్ జాన్సన్కు పఠాన్కు మధ్య మాటల యుద్ధం జరిగింది. ఇద్దరు ఒకరినొకరు ఆవేశంతో దగ్గరికి వచ్చారు. సడెన్గా జాన్సన్.. యూసుఫ్ పఠాన్ను చేతులతో నెట్టేస్తాడు. ఈ క్రమంలో యూసుఫ్ తిరిగి సీరియస్ అవుతుంటే అంపైర్లు అతన్ని ఆపుతారు. జాన్సన్ను మరో అంపైర్ దూరంగా తీసుకెళ్లారు. అప్పటితో ఆ వాగ్వాదం ముగిసింది. ఇది ముగిశాక.. ఫీల్డ్లో అసభ్యకరమైన వాగ్వాదానికి పాల్పడినందుకు మిచెల్ జాన్సన్కు లెజెండ్స్ లీగ్ టోర్నీ నిర్వాహకులు మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత విధించారు.
కాగా, ఈ మ్యాచులో బిల్వారా కింగ్స్ పై ఇండియా క్యాపిటల్స్ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన బిల్వారా కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 226 పరుగులు చేయగా.. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇండియా క్యాపిటల్స్ 19.3 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదిస్తుంది. జైపూర్ సావే మాన్ సింగ్ స్టేడియం వేదికగా అక్టోబర్ 5న ఈ రెండు జట్ల మధ్య ఫైనల్ పోరు జరగనుంది.
#ICYMI: Things got really heated in @llct20 between Yusuf Pathan and Mitchell Johnson. 🔥 pic.twitter.com/4EnwxlOg5P
— Nikhil 🏏 (@CricCrazyNIKS) October 2, 2022